Share News

విఽధులకు ఆలస్యంగా వైద్యులు

ABN , Publish Date - Feb 10 , 2026 | 01:12 AM

ప్రతి నెలా 9న హైరిస్క్‌ గర్భవతులకు పీహెచసీల్లో ప్రధాన మంత్రి మాతృత్య (పీఎంఎ్‌సఎంఏ) సురక్ష అభియాన పథకం కింద వైద్య పరీక్షలు, మందులు ఇస్తారు.

విఽధులకు ఆలస్యంగా వైద్యులు
వైద్య పరీక్షలకు వచ్చిన గర్భవతులు

కూడేరు, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ప్రతి నెలా 9న హైరిస్క్‌ గర్భవతులకు పీహెచసీల్లో ప్రధాన మంత్రి మాతృత్య (పీఎంఎ్‌సఎంఏ) సురక్ష అభియాన పథకం కింద వైద్య పరీక్షలు, మందులు ఇస్తారు. దీంతో స్థానిక పీహెచసీకి సోమవారం అధిక సంఖ్యలో గర్భిణులు వచ్చారు. ఈ పీహెచసీలో ఇద్దరు వైద్యులు ఉండగా.. సోమవారం ఒకరు 104 వాహనంలో గ్రామాలకు వెళ్లారు. మరో డాక్టర్ట్‌ 11 గంటలైన రాకపోవడంతో రోగులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వైద్యులు విధులకు ఆలస్యంగా రావడం పరిపాటిగా మారిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - Feb 10 , 2026 | 01:12 AM