రైతుల అవసరం మేరకు ఎంత విత్తనమైన అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎమ్మె ల్యే పరిటాలసునీత అన్నారు. శనివారం మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రం వద్ద ఆమె విత్తన వేరుశనగ పంపిణీని ప్రారంబించారు.
మండల కేంద్రంలోని ప్రభు త్వాస్పత్రి ఎన్నో యేళ్లుగా అభివృద్ధికి నోచుకోలేదు. ఆలయ ఆవరణంఓ ఎన్నో సంవత్సరాలుగా చెత్తాచెదారంతో నిండి ఉండేది. మండల కేంద్రం లోని ప్రధాన రహదారి గుండా పారీఏ వర్షపు నీరు ,మురుగునీరు ఆస్పత్రి ఆవరణలోకి చేరి అధ్వాన్నస్థితిలో వుండేది.
అర్హులైన ఏ ఓటరుకూ అన్యాయం జరక్కూడదని, అక్రమ ఓట్లపైనా దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ పార్టీ నేతలను ఆదేశించారు. శనివారం అర్బన కార్యాలయంలో ఆయన పార్టీ క్లస్టర్ ఇనచార్జులు, యూనిట్, డివిజన ఇనచార్జులు, ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు.
కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి దేవాలయంలో ఆలయ అభివృద్ధికొరకు పట్టణానికి చెందిన తలారి రామలింగప్ప కుమారుడు తలారి రవికుమార్ రూ. 2,34,567 విరాళం అందజేశారు.
నేతన్నల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. పట్టణంలోని నివా సంలో ఆయన శనివారం చింతల వెంకట రమణస్వామి క్లస్టర్ అభివృద్ధి పథకం కింద 180మంది చేనేత కార్మికులకు రూ.49లక్షల విలువవై న పనిముట్లను పంపిణీ చేశారు.
స్థానిక మున్సిపాల్టీ అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పే ర్కొన్నారు. ఆయన శనివారం పట్టణంలోని స్వగ్రామంలో కళ్యాణదుర్గం మున్సిపాల్టీ పరిధిలోని టీడీపీ క్లస్టర్, కో క్లస్టర్, యూనిట్ ఇనచార్జ్ లు, బూత ఇనఛార్జ్లకు సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
మేము ఉండగా సెక్యూరిటీ గార్డు ఎందుకు దండగా..? అన్నట్లుగా నాలుగైదు వీధికుక్కలు కణేకల్లులోని ఎస్బీఐ ఏటీఎం వద్దనే ఉంటున్నాయి. దీంతో ఖా తాదారులు ఏటీఎంలోకి వెళ్లాలంటేనే భయపడుతు న్నారు. ఖాతాదారుల భద్రత కోసం సెక్యూరిటీ గా ర్డు ఉండాల్సిన చోట అవి మకాం వేస్తుండడంతో వి నియోగ దారులు భయంతో ఏటీఎంలోకి అ డుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది.
రాప్తాడు, ధర్మవరం నియోజకవవర్గాల్లో విద్యుత సమస్యలు పరిష్కరించాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ను ఎమ్మెల్యే పరిటాల సునీత కోరారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తయిన సందర్భంగా రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి సంక్షేమ పేరుతో తిరుపతి దామినేడులో జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి నారాలోకేశ, విద్యుత శాఖ మంత్రి గొట్టిపాటితో పాటు పలువురు మంత్రులతో ఆమె భేటీ ఆయ్యారు.
వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో తాడిపత్రి పోలీస్ స్టేషన్ ఎదుట మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి దీక్ష విరమించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డిపై 196(1)BNS సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచిత వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దారెడ్డి ఇంటి ఎదుట ఆందోళనకు జేసీ సిద్ధమయ్యారు.