ఖరీఫ్ సీజన లో వర్షాలు బాగా కురిసి, పం టలు బాగా పండాలని గ్రామ దేవత కుంటెమ్మను రైతులు వేడుకున్నారు. మండలపరిధి లోని పి. నాగిరెడ్డిపల్లిలో మం గళవారం గ్రామ దేవత కుంటె మ్మకు ఇంటింటి నుంచి అన్న దాతలు బోనాలు సమర్పించారు.
ప్రజా సమస్యలు పరిష్కరిం చడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే జేసీ అశ్మితరెడ్డి పేర్కొన్నారు. ఆయన మంగళవారం పట్టణంలోని కృష్ణాపురం ఒకటో రోడ్డు, రెండో రోడ్డు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ప్రజలను పలకరిస్తూ, సమ స్యలను అడిగి తెలుసుకున్నారు.
వేసవి సెలవుల అనంతరం మరో వారం రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. చాలా చోట్ల పాఠశాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి చర్యలు కనిపిం చడం లేదు. గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో నేటికీ విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదని విమర్శలు ఉన్నాయి.
అనంతపురం జిల్లా డి. హిరేహాల్ మండలంలోని జూజరకల్ టోల్ ప్లాజా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు సజీవదహనం అయ్యారు. మంగళవారం రహదారి పక్కన ఆగి ఉన్న సిమెంట్ ట్యాంకర్ను మరో లారీ ఢీ కొట్టింది.
బాలురు, యువకులు ఖరీదైన బైక్లపై శరవేగంగా దూసుకొస్తారు. ఉన్నఫలంగా వీలింగ్ చేస్తారు.
పోలీసుల సంక్షేమానికి కృషి చేస్తు న్నామని ఎస్పీ జగదీష్ పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న పాత పోలీస్ క్వార్టర్స్ మైదానంలో సోమవారం పోలీస్ వెల్ఫేర్ విభాగం ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు నిర్మాణానికి ఎస్పీ జగదీష్ సోమవారం భూమిపూజ చేశారు.
అధికారుల ఒత్తిళ్లతోనే కర్నూలులో వీఆర్వో హుస్సేన ఆత్మహత్య చేసుకున్నారని సచివాలయ ఉద్యోగుల అసోసియేషన నాయకులు విమర్శించారు. వీఆర్వో ఆత్మహత్యకు నిరసనగా సోమవారం సాయంత్రం స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి జడ్పీ ఎదురుగా ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఎలాంటి షరతులు లేకుండా మహిళా రిజర్వేషన బిల్లును ప్రవేశపెట్టి తీర్మానం చేయాలని ఏపీ మహిళా సమాఖ్య నేతలు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్వద్ద వారు నిరసన తెలిపారు.
కర్నూలు జిల్లాలో వీ ఆర్వో మ హమ్మద్ హుసేన ఆత్మహత్యపై స్ధానిక తహసీల్దార్ కార్యాల యం వద్ద సోమవారం గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం ఆధ్వర్యం లో నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు.
ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తరణ సవరణ(సర్) నేపథ్యంలో ఓట్ల కూర్పులు, చేర్పులపై పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని టీడీపీ నగర అధ్యక్షుడు సుధాకర్ యాదవ్ సూచించారు. బుధవారం అర్బన కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.