Share News

రైతుల ఖాతాల్లోకి రూ.361.41 కోట్లు

ABN , Publish Date - Jul 09 , 2026 | 11:20 AM

వానాకాలం పంటల సాగుకు సంబంధించిన పెట్టుబడి సాయం నిధులు విడతల వారీగా రైతుల బ్యాంకుల ఖాతాలకు బదిలీ చేస్తున్నారు.

రైతుల ఖాతాల్లోకి రూ.361.41 కోట్లు
Telangana Rythu Bharosa

  • 82,75,567 మందికి అందిన సాయం

వికారాబాద్‌: వానాకాలం పంటల సాగుకు సంబంధించిన పెట్టుబడి సాయం నిధులు విడతల వారీగా రైతుల బ్యాంకుల ఖాతాలకు బదిలీ చేస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రైతు భరోసా పథకం కింద బుధవారం వరకు జిల్లా వ్యాప్తంగా 2,75,567 మంది రైతుల ఖాతాల్లో రూ.361,41,55,892 నిధులు జమ చేశారు. తొలి రోజు ఎకరా లోపు ఉన్న అన్నదాతల ఖాతాల్లో భరోసా నిధులు జమ కాగా,


zzzz.jpgఆ తర్వాత వరుసగా రోజుకు ఒక ఎకరా పెంచుతూ రెండు నుంచి, ఏడు ఎక రాల వరకు విస్తీర్ణం కలిగిన రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం నిధులు జమ చేశారు. పంటలు సాగుకు సన్నద్ధమయ్యే సమయంలో ప్రభుత్వం రైతు భరోసా పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ చేయడం పట్ల అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

24/7.. ఆర్థిక కేంద్రంగా హైదరాబాద్‌!

మరింతగా తగ్గిన బంగారం ధరలు.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

Read Latest AP News And 

Updated Date - Jul 09 , 2026 | 11:20 AM