మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
ABN , Publish Date - Aug 11 , 2026 | 06:59 PM
తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించింది.
హైదరాబాద్, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. మండల స్థాయిలో ప్రజావాణి నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి సోమవారం మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనుంది. ఈ మేరకు జీవో ఎంఎస్ నంబర్-4 ద్వారా ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రజావాణిపై ఎంపీడీవోలకు శిక్షణ, అవగాహన కార్యక్రమం నిర్వహించనుంది. ఆగస్టు 13వ తేదీన ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారికి శిక్షణ ఇవ్వనుంది. హైదరాబాద్ ప్రజాభవన్లో ఈ శిక్షణ కార్యక్రమం జరగనుంది. మండల నోడల్ అధికారులైన ఎంపీడీవోలు తప్పనిసరిగా ఈ శిక్షణకు హాజరు కావాలని తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది.
వార్తలు కూడా చదవండి...
'హర్ ఘర్ తిరంగా' అభియాన్లో ప్రతి భారతీయుడు భాగస్వామి కావాలి: బండి సంజయ్
ఉదయ్ కృష్ణారెడ్డి కేసును సీబీసీఐడీకి బదిలీ చేయాలి: సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు
తెలంగాణలో 73.95 లక్షల ఓట్లు ఔట్?
Read Latest AP News And Telangana News And National News
And Telugu News