హైదరాబాద్లోని ఈ ఏరియాల్లో 11 గంటల నుంచి సాయంత్రం 4 వరకు కరెంట్ కట్
ABN , Publish Date - Aug 25 , 2026 | 07:36 AM
హైదరాబాద్ నగరంలోని బాలాజీహిల్స్, హేమానగర్ ఫీడర్ల పరిధిలో 33 కేవీ టవర్ నిర్మాణ పనుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది.
ఉప్పల్(హైదరాబాద్): హైదరాబాద్ నగరంలోని బాలాజీహిల్స్, హేమానగర్ ఫీడర్ల పరిధిలో 33 కేవీ టవర్ నిర్మాణ పనుల కారణంగా మంగళవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సరఫరా నిలిపివేయనున్నట్లు చిల్కానగర్ ఏఈ వినయ్కుమార్రెడ్డి తెలిపారు.
సాయిభవానీనగర్, గాయత్రీహిల్, మల్లయ్యనగర్, వాసవినగర్, సప్తగిరి కాలనీ, నార్త్ బాలాజీహిల్స్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. వినియోగదారులు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, అంతరాయం సమయంలో విద్యుత్ శాఖకు సహకరించాలని అధికారులు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మరింత పైకి.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News