హైదరాబాద్లో అద్భుతం.. 3.8 లక్షల వజ్రాలతో కొలువుదీరిన గణపయ్య ..
ABN , Publish Date - Sep 15 , 2026 | 11:58 AM
హైదరాబాద్ బేగంబజార్లో 24 క్యారెట్ల బంగారంతో, 3.8 లక్షల అమెరికన్ డైమండ్లతో కొలువుదీరిన గణపయ్య విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టకుంటోంది. దీన్ని చూసేందుకు ప్రజలు తరలివస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతి ఏటా ప్రతేక్యమైన, విభిన్నమైన వినాయకుడి విగ్రహాలను చూస్తూనే ఉంటాం. కరెన్సీ గణపతి, కూరగాయల గణపతి ఇలా రకరకాల రూపంలో గణనాథుడు దర్శనమిస్తుంటాడు. అయితే ఈ సంవత్సరం హైదరాబాద్లోని బేగంబజార్లో గణేశుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. 24 క్యారెట్ల బంగారంతో, 3 లక్షల 83 వేల అమెరికన్ డైమండ్లతో తయారు చేసిన ఈ గణపయ్య విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బేగంబజార్లోని లీచీ పర్ల్ సెట్ జ్యువెలరీ షాపులో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో ఈ బంగారు గణపయ్య దర్శనమిస్తున్నాడు. వజ్రాలతో కొలువుదీరిన గణేశుణ్ని చూసి తరించడానికి భక్తులు తరలి వస్తున్నారు. బంగారు నిగనిగలతో, వజ్రాల ధగధగలతో వెలిగిపోతున్న వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు.
జ్యువెలరీ షాపు యజమాని ఆధార్ అగర్వాల్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాది వినాయక చవితి కోసం ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా చేయించామని చెప్పారు. గత రెండేళ్లుగా తమ షాపులో గణేశ్ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. ఈ సారి దశావతారాన్ని గుర్తు చేసేలా విగ్రహాన్ని రూపొందించామని తెలిపారు. ముంబైలోని లాల్బాగ్చా రాజా, తిరుపతిలోని వేంకటేశ్వర స్వాముల రూపాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ బంగారు ప్రతిమను తయారు చేశామని వెల్లడించారు. ఈ విగ్రహాన్ని చేయడానికి 8 మంది నిపుణులు 8 నెలల పాటు కష్టపడ్డారన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుపతిలో ఏడు టన్నుల విభూతితో 11 అడుగుల భారీ వినాయకుడు..
వినాయక చవితి వేళ ప్రత్యేక ఆకర్షణగా గోల్డెన్ మోదక్.. కిలో రూ.27,000..