మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ను తప్పించాలని బీజేపీ కుట్ర: చామల కిరణ్ కుమార్
ABN , Publish Date - Jun 10 , 2026 | 01:44 PM
మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఓ ప్రైవేట్ కేసును అడ్డం పెట్టుకొని కావాలనే మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ చేశారని విమర్శించారు.
హైదరాబాద్, జూన్ 10: మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్ను ఎన్నికల అధికారులు తిరస్కరించడంపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఓ ప్రైవేట్ కేసును అడ్డం పెట్టుకొని కావాలనే మీనాక్షి నటరాజన్ నామినేషన్ రిజెక్ట్ చేశారని విమర్శించారు. బీఎన్ఎస్ యాక్ట్ 230 ప్రకారం ఫామ్ 26 సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. బీజేపీ.. ఎన్నికలను వాళ్ల ఖాతాలో వేసుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఈడీ, సీబీఐ, ఈసీని అడ్డం పెట్టుకొని బీజేపీ ఎన్నికల్లో గెలుస్తోందన్నారు.
మధ్యప్రదేశ్లో బీజేపీకి రెండు రాజ్యసభ సీట్లకు అవకాశం ఉందని.. కాంగ్రెస్కు ఒక రాజ్యసభ వచ్చే అవకాశం ఉందని ఎంపీ తెలిపారు. మూడో అభ్యర్థిని బీజేపీ ఎందుకు పోటీలో నిలబెడుతోందని ప్రశ్నించారు. ముందు నుంచే మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ను తప్పించాలని బీజేపీ చూసిందని వ్యాఖ్యానించారు. బీజేపీ చేస్తున్న కుటిల రాజకీయం గురించి దేశ ప్రజలకు తెలియాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండూ ఒక్కటే అని విమర్శించారు. రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ను లేకుండా చేయాలని కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. మధ్యప్రదేశ్లో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ సమర్థిస్తుందా అని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలు చేస్తే ఎప్పటికీ అధికారంలోకి రారని చామల కిరణ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి...
మాతృభూమిపై గౌరవం.. దేశానికే జీవితం అంకితం.. మోదీపై పవన్ ప్రశంసలు
భారత్ ఫ్యూచర్ సిటీ కల సాకారం.. చరిత్రలో నిలిచే రోజు: సీఎం రేవంత్
Read Latest Telangana News And Telugu News