Share News

డీఎస్పీ భీమ్‌రెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు..

ABN , Publish Date - Jul 02 , 2026 | 10:04 AM

డీఎస్పీ ఎస్. భీమ్‌రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు చేస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.

డీఎస్పీ భీమ్‌రెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు..
ACB Raids

హైదరాబాద్, జులై 2 (ఆంధ్రజ్యోతి): డీఎస్పీ ఎస్. భీమ్‌రెడ్డి నివాసంలో ఏసీబీ అధికారులు ఈరోజు (గురువారం) సోదాలు చేస్తున్నారు. ఏసీబీ డీఎస్పీ మాజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని భీమ్‌రెడ్డి నివాసంతో పాటు 20 ప్రాంతాల్లో రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి డీఎస్పీ భీమ్‌రెడ్డికి అక్రమాస్తులు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారుల సోదాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రూ.8 కోట్ల విలువైన విల్లాలో భీమ్‌‌రెడ్డి ఉంటున్నారని.. ఆయన భారీగా అక్రమాస్తులు సంపాదించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.


ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డి నివాసంలో ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నార్సింగిలోని వేసెల్లా మెడోస్ విల్లాలో రెండు ఏసీబీ బృందాలు రైడ్స్ చేస్తున్నాయి. ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి తనిఖీలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పని చేశారు భీమ్‌రెడ్డి. గతంలో వనస్థలిపురం, జహీరాబాద్, బాల్‌నగర్‌లో పోలీసుస్టేషన్‌లలో ఆయన పని చేశారు. డీఎస్పీగా పటాన్‌చెరువులో పని చేశారు. ప్రస్తుతం డీజీపీ ఆఫీసులోని కంప్యూటర్ సర్వీసెస్‌లో భీమ్‌రెడ్డి పని చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

హైటెక్ డ్రోన్ పోలీసింగ్.. గంజాయి సేవిస్తున్న వారిపై ప్రత్యేక నిఘా

హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. కాలేజీ బస్సు ఢీకొని మహిళ మృతి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 02 , 2026 | 11:04 AM