Share News

కుల్‌దీప్ యాదవ్‌పై వారికి నమ్మకం లేదు.. అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు

ABN , Publish Date - Aug 21 , 2026 | 06:39 PM

ప్రస్తుతం చర్చంతా టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ గురించే! శ్రీలంకతో తొలి టెస్టులో అతడికి అవకాశాలు ఇవ్వలేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

కుల్‌దీప్ యాదవ్‌పై వారికి నమ్మకం లేదు.. అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు
Kuldeep Yadav

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం చర్చంతా టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్‌దీప్ యాదవ్ గురించే! శ్రీలంకతో తొలి టెస్టులో అతడికి అవకాశాలు ఇవ్వలేదంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఇదే విషయంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. టీమ్ మేనేజ్‌మెంట్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్.. కుల్‌దీప్ యాదవ్‌ను పూర్తిగా నమ్మడం లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయని తెలిపాడు. ప్రస్తుతం అశ్విన్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి.


తొలి టెస్టులో కుల్‌దీప్ 25 ఓవర్లు బౌలింగ్ చేసి 103 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ మాత్రమే తీశాడు. స్పిన్నర్లకు అనుకూలంగా ఉన్న గాలే పిచ్‌పై కూడా అతడు పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అయితే కుల్‌దీప్‌కు తగినంత బౌలింగ్ అవకాశాలు ఇవ్వకపోవడమే అతడి వైఫల్యానికి కారణమని అశ్విన్ పేర్కొన్నాడు. ‘జడేజా ఒక వైపు, సుతార్ మరోవైపు వికెట్లు తీస్తున్నారని అందరూ ప్రశ్నిస్తారు. కానీ కుల్‌దీప్ మూడో స్పిన్నర్. నేను, జడేజా ఆడుతున్నప్పుడు కూడా అతడు మూడో స్పిన్నర్‌గానే ఉండేవాడు. ఇప్పుడు కూడా పరిస్థితి మారలేదు. 11 మంది ఉన్న జట్టులో మూడో లేదా నాలుగో స్పిన్నర్‌గా ఉండటం అంత సులభం కాదు’ అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.


కుల్‌దీప్‌ను గిల్ నమ్మడం లేదు..

‘కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు కుల్‌దీప్ యాదవ్ ప్రాధాన్యత కలిగిన బౌలర్ కాకపోవచ్చు. కుల్‌దీప్ ప్రస్తుతం చాలా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అతడు తన నైపుణ్యాన్ని కోల్పోయాడా? అంటే అస్సలు కాదు. చాలా కాలం తర్వాత మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్‌లో కూడా అతడిని సరిగ్గా ఉపయోగించలేదు. ఇది ఆటగాడి తప్పు కాదు. ఇది ప్లేయర్‌పై మేనేజ్‌మెంట్‌కు నమ్మకం లేదనడానికి ఒక సంకేతం. అతడికి మద్దతు లభించడం లేదు. మూడో స్పిన్నర్‌ను తీసుకోవాలనుకుంటే.. అది కుల్‌దీప్ యాదవ్‌తోనే కొనసాగాలి. అతడిపై నమ్మకం ఉంచాలి’ అని అశ్విన్ పేర్కొన్నాడు. ఇక రెండో టెస్టు ఆగస్టు 23 నుంచి కొలంబోలో జరగనుంది. గాలే టెస్టులో భారత్ 165 పరుగుల భారీ విజయం సాధించి సిరీస్‌లో 1–0 ఆధిక్యంలో ఉంది. మరి కొలంబో టెస్టులో కుల్‌దీప్‌కు అవకాశం దక్కుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.


ఇవి కూడా చదవండి:

స్పిన్ ఉచ్చులో చిక్కకుండా.. నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తోన్న శుభ్‌మన్ గిల్

బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్: సెమీస్‌కు ట్రీసా-గాయత్రి జోడీ.. పతకం ఖాయం

Updated Date - Aug 21 , 2026 | 06:39 PM