హైదరాబాద్లో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవం.. పాల్గొన్న ప్రముఖులు
ABN, Publish Date - Jun 27 , 2026 | 07:54 AM
హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ సీవీ ఆనంద్, హీరో రామ్ పోతినేని, పాల్గొన్నారు.
1/23
హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ దినోత్సవ కార్యక్రమం శుక్రవారం జరిగింది.
2/23
ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ సీవీ ఆనంద్, హీరో రామ్ పోతినేని, పాల్గొన్నారు.
3/23
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క యువతకు డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పిస్తూ కీలక సందేశాన్ని ఇచ్చారు.
4/23
డ్రగ్స్ అనేది ఒక ప్రమాదకరమైన ఊబి లాంటిదని, ఒకసారి దానికి అలవాటు పడితే ఆ వ్యసనం నుంచి బయటపడటం చాలా కష్టమని భట్టి విక్రమార్క హెచ్చరించారు.
5/23
క్షణికమైన ఆనందం కోసం డ్రగ్స్ వైపు అడుగులు వేయడం ద్వారా జీవితాన్ని నాశనం చేసుకోవద్దని యువతను భట్టి విక్రమార్క కోరారు.
6/23
జీవితంలో ఎన్నో అవకాశాలు, లక్ష్యాలు, విజయాలు సాధించాల్సి ఉన్న సమయంలో డ్రగ్స్కు బానిస కావడం వల్ల వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామాజికంగా తీవ్ర నష్టాలు ఎదురవుతాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
7/23
ఒకసారి డ్రగ్స్కు అలవాటు పడిన తర్వాత మళ్లీ సాధారణ జీవితంలోకి రావడం చాలా క్లిష్టమవుతుందని, అందుకే మొదటి అడుగే డ్రగ్స్ వైపు వేయకపోవడం ఉత్తమమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
8/23
డ్రగ్స్ తీసుకోవాలని స్నేహితులు లేదా పరిచయస్తులు ఒత్తిడి చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని భట్టి విక్రమార్క సూచించారు.
9/23
డ్రగ్స్ అనేది వ్యక్తి ఆరోగ్యానికే కాకుండా కుటుంబాల భవిష్యత్తుకు, సమాజ శాంతి భద్రతలకు కూడా పెద్ద ముప్పుగా మారుతోందని రామ్ పేర్కొన్నారు. యువత తమ ప్రతిభ, శక్తి, సమయాన్ని సానుకూల దిశలో వినియోగించి దేశాభివృద్ధికి తోడ్పడాలని సూచించారు.
10/23
అలాంటి సందర్భాల్లో సంకోచించకుండా, ధైర్యంగా వారి ముఖం మీదే ‘నో’ అని చెప్పాలని యువతకు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
11/23
డ్రగ్స్ నెట్వర్క్ను చేధించడంలో ఈగల్ టీమ్ బాగా పనిచేస్తోందనిమంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
12/23
తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలన కోసం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు.
13/23
యువత మంచి భవిష్యత్తు కోసం సరైన నిర్ణయాలు తీసుకోవాలనిహీరో రామ్ సూచించారు.
14/23
తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలన కోసం చేపడుతున్న చర్యలను రామ్ పోతినేని అభినందించారు.
15/23
ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ఈగల్ ఫోర్స్’ వ్యవస్థ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తోందని రామ్ కొనియాడారు.
16/23
డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడం, డ్రగ్స్ మాఫియాను గుర్తించడం, నేరస్తులపై చర్యలు తీసుకోవడంలో ఈగల్ ఫోర్స్ కీలక పాత్ర పోషిస్తోందని రామ్ పేర్కొన్నారు.
17/23
డ్రగ్స్ నెట్వర్క్ను ఛేదించడంలో ఈగల్ ప్రత్యేక బృందం మంచి ఫలితాలు సాధిస్తోందని రామ్ చెప్పుకొచ్చారు.
18/23
డ్రగ్స్ సమస్యను కేవలం ప్రభుత్వాలు లేదా పోలీసు శాఖ మాత్రమే ఎదుర్కోలేవని, సమాజంలోని ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని రామ్ స్పష్టం చేశారు.
19/23
ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరిస్తేనే డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని రామ్ వివరించారు.
20/23
కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, స్నేహితులు కలిసి యువతను సరైన దారిలో నడిపించాల్సిన అవసరం ఉందని రామ్ పేర్కొన్నారు.
21/23
తమ పరిసరాల్లో ఎవరైనా డ్రగ్స్ వాడుతున్నా, విక్రయిస్తున్నా లేదా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపించినా వెంటనే తమకు సమాచారం అందించాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు.
22/23
డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాల గురించి నటి మీనాక్షీ చౌదరి అవగాహన కల్పించారు. యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
23/23
సమాజం కోసం ధైర్యంగా ముందుకు వచ్చి సమాచారం ఇవ్వడం ప్రతి పౌరుడి బాధ్యత అని డీజీపీ సీవీ ఆనంద్ వ్యాఖ్యానించారు.
Updated at - Jun 27 , 2026 | 08:14 AM