Home » Drugs Case
ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో అక్రమంగా తరలిస్తున్న డ్రగ్స్ను భారీ స్థాయిలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు మిజోరాం శాంతి భద్రతల ఐజీ శుక్రవారం సిల్చార్లో వెల్లడించారు.
హైదరాబాద్ ఐటీ కారిడార్(Hyderabad IT Corridor)లో.. సైబర్టవర్స్ సమీపంలో నిర్వహిస్తున్న రియల్టర్లు, యువతుల రేవ్పార్టీని ఎక్సైజ్ స్పెషల్ టాస్క్ఫోర్స్ (Excise Special Task Force) పోలీసులు భగ్నం చేశారు.
నగరంలో డ్రగ్స్ కల్చర్ పెరుగుతున్నది. ఇటీవల నార్కోటిక్ పోలీసులు జరిపిన దాడుల్లో నమ్మలేని నిజాలు వెలుగుచూశాయి. చిన్నమొత్తంలో లభించే మాదకద్రవ్యం ప్రస్తుతం కిలోల చొప్పున పట్టుబడుతోంది.
నగరంలో డ్రగ్స్ సరఫరా రోజురోజుకు కొంతపుంతలు తొక్కుతోంది. డ్రగ్స్ నివారణకు తెలంగాణ నార్కొటిక్ బ్యూరో(TS-NAB), పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా పరిస్థితి మాత్రం అదుపులోకి వచ్చినట్లు కనపడడం లేదు. డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉందంటూ నగరంలోని జూబ్లీహిల్స్ సహా పలు ప్రాంతాల్లోని పబ్బుల్లో నిరంతరం పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు.
గంజాయికి అలవాటుపడిన ఓ బీటెక్ విద్యార్థి డ్రగ్ పెడ్లర్(Drug peddler)గా మారాడు. ఈ క్రమంలో గంజాయి సేవిస్తుండగా.. అతడితో పాటు మరో ఐదుగురు విద్యార్థులను పోలీసులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
సాధారణంగా ఐటీ, పరిశ్రమలు, విద్య, వ్యవసాయం వంటి రంగాల్లో అభివృద్ధి సాధించేందుకు రాష్ట్రాలు పోటీ పడతాయి. జగన్ ఐదేళ్ల పాలనలో ఈ రంగాల్లో ఏపీ అట్టడుగున ఎక్కడో ఉంది.
Telangana: నగరంలో సంచలనంగా మారిన నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపడ్డాయి. ఏబీఎన్ - ఆంధ్రజ్యోతి చేతికి చిక్కిన డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో.. ఈ కేసుకు సంబంధించి మొత్తం 20 మంది నిందితులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల్లో 7 గురు ఫెడ్లర్లు, 13 మంది కన్యుమర్లు ఉన్నారు.
నగరంలో సోమవారం పట్టుబడ్డ అంతర్జాతీయ డ్రగ్స్ రాకెట్(International drug racket)ను విచారించిన క్రమంలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. ఇద్దరు నైజీరియన్లు సహా.. ఐదుగురిని అరెస్టు చేసిన తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు.. వారిని విచారించిన అనంతరం మంగళవారం మధ్యాహ్నం కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు తరలించారు.
డ్రగ్స్, సైబర్ నేరాల విషయంలో ఉక్కుపాదం మోపాలని పోలీస్ శాఖను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. భద్రతపై ప్రజలకు భరోసా కల్పించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని, అవసరమైతే డీజీపీ నుంచి కానిస్టేబుల్ వరకు క్షేత్ర స్థాయి (ఫిజికల్ పోలీసింగ్)లో ఉండాలని స్పష్టం చేశారు. పోలీస్ కళ్లెదుటే ఉన్నాడనేలా రహదారులపై కనిపించాలని సూచించారు.
ఉచెన్నా.. ఎజియోనిలి ఫ్రాంక్లిన్ ఉచెన్నా అలియాస్ కలేషీ..! ఎనిమిదేళ్లుగా హైదరాబాద్ నగరంలోనే తిష్ట వేశాడు. నైజీరియా నుంచి డ్రగ్స్ తెప్పించి.. నగరంలో విక్రయించాడు.