Home » CV Anand
తెలంగాణలో బక్రీద్ పండుగను పురస్కరించుకుని శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతోందని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఆయన వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో డ్రగ్స్ కట్టడి చేయడమే తమ తొలి ప్రాధాన్యమని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. రిపీటెడ్గా డ్రగ్స్ కేసులో పట్టుబడితే పీడీ యాక్ట్ తరహా చట్టాన్ని ఉపయోగిస్తామన్నారు. రాష్ట్ర డీజీపీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గురువారం తొలిసారిగా ఈగల్ ఫోర్స్పై ఆయన సమీక్ష నిర్వహించారు.
తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని డీజీపీని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలిపివేయొద్దని డీజీపీకి సూచించారు.
తెలంగాణ పోలీస్ శాఖలో పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. శాంతి భద్రతలు కాపాడటంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా జరిగింది.
ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్పై తెలంగాణ రాష్ట్ర హోం శాఖ స్పెషల్ సీఎస్ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను అభినందించారు.
రంగారెడ్డి జిల్లా మంచిరేవుల గ్రేహౌండ్స్ క్యాంపస్లో 'యంగ్ ఇండియా పోలీస్ స్కూల్' అడ్మిషన్ల ప్రక్రియ షురూ అయింది. ఈ స్కూల్ లో 50 శాతం అడ్మిషన్లు యూనిఫాం సిబ్బందికి, మిగిలిన 50 శాతం సీట్లు సాధారణ విద్యార్థులకు..
సినిమాల పైరసీ వల్ల నిర్మాతల కష్టం వృథా అవుతోందని.. ఈ పరిశ్రమ బాగా ప్రభావానికి గురవుతోందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు.పైరసీపై తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
పోలీసులు రెండు రోజుల పాటు నిద్ర లేకుండా గణనాథుల శోభాయాత్రలో బందోబస్తు చేశారని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ సమితి సభ్యుల సమన్వయంతో అనుకున్న సమయం కంటే ముందే నిమజ్జనం పూర్తి చేశామని వివరించారు. పదిరోజులుగా గణేశ్ మండపం నిర్వాహకులను ఒప్పించి ఈ ఏడాది ముందుగానే వినాయకుల విగ్రహాలను తీయించామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
గణేశ్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దు.. నిర్వాహకులు స్థానిక పోలీసులకు సహకరించాలి.. ఎట్టి పరిస్థితుల్లోనూ నిబంధనలు ఉల్లంఘించొద్దని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. సోమవారం వెస్టుజోన్ పరిధిలోని బోరబండ, రహమత్నగర్, బంజారాహిల్స్, మధురానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని గణేశ్ మండపాలను సీపీ సీవీ ఆనంద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.