Home » Telangana DGP
దేశాన్ని పట్టి పీడిస్తున్న నక్సల్స్ తీవ్రవాదానికి ముగింపు పలకడమే తమ లక్ష్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. తెలంగాణను నక్సల్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దిన తెలంగాణ పోలీస్ అధికారులను ప్రత్యేకంగా అమిత్ షా అభినందించారు.
తెలంగాణలో బక్రీద్ పండుగను పురస్కరించుకుని శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతోందని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఆయన వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. తక్షణమే విచారణ మొదలుపెట్టాలని డీజీపీ సీవీ ఆనంద్ను సీఎం ఆదేశించారు.
డీజీపీ సీవీ ఆనంద్ను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిశారు. కరీంనగర్లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ క్యాంప్ కార్యాలయంతో పాటు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాహనంపై బీజేపీ కార్యకర్తల దాడి అంశంపై డీజీపీకి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేశారు.
తన పర్యటనల సమయంలో ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని డీజీపీని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రజలను గంటల తరబడి రోడ్లపై నిలిపివేయొద్దని డీజీపీకి సూచించారు.
తెలంగాణ పూర్తి స్థాయి డీజీపీ నియామకం అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. సీవీ ఆనంద్ను తెలంగాణకు రెగ్యులర్ డీజీపీగా నియమించినట్లు ఉన్నత న్యాయస్థానానికి అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి తెలిపారు.
తెలంగాణ పోలీస్ శాఖలో పునర్వ్యవస్థీకరణ చేపట్టనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. శాంతి భద్రతలు కాపాడటంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా జరిగింది.
ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ నడిపించామని డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తుకు అనుగుణంగా పోలీస్ శాఖను సిద్ధం చేశామని చెప్పారు.
తెలంగాణ పోలీసులకు డీజీపీ శివధర్రెడ్డి గుడ్న్యూస్ చెప్పారు. పోలీసుల సంక్షేమం దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.