Share News

13 ఏళ్ల బాల కార్మికురాలిని రక్షించిన టాస్క్ ఫోర్స్.. వీడియో వైరల్

ABN , Publish Date - Feb 04 , 2026 | 05:33 PM

అసోం రాజధాని గౌహతి పంజాబరిలో మానవత్వానికే మచ్చ తెచ్చే ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఒక ఇంట్లో బానిసలా మగ్గుతున్న 13 ఏళ్ల బాలికను జిల్లా కార్మిక టాస్క్ ఫోర్స్ అధికారులు రక్షించారు. బాలికను అత్యంత అమానవీయంగా మంచం లోపల ఉన్న ర్యాక్‌లో దాచిపెట్టారు.

13 ఏళ్ల బాల కార్మికురాలిని రక్షించిన టాస్క్ ఫోర్స్.. వీడియో వైరల్
Guwahati Minor Girl Rescued

ఇంటర్నెట్ డెస్క్: అసోం రాష్ట్రం గౌహతీ పంజాబరిలో ఓ కుటుంబం చిన్నారిని చిత్రహింసలకు గురి చేసింది. పనిలో పెట్టుకుని ఏడేళ్లుగా నరకం చూపించింది. ఈ విషయం గురించి తెలుసుకున్న జిల్లా కార్మిక టాస్క్ ఫోర్స్ అధికారులు ఆ ఇంటిపై దాడి చేశారు. అధికారులు ఇంటిని సోదా చేస్తున్న సమయంలో ఎక్కడా బాలిక కనిపించలేదు. అయితే, యజమానుల ప్రవర్తనపై అనుమానం వచ్చి బెడ్ కాట్(మంచం)ను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. మంచం లోపల ఒక ఇరుకైన ర్యాక్‌లో బాలికను కుక్కి దాచినట్లు గుర్తించిన అధికారులు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారు.


బాలికకు విముక్తి..

టాస్క్ ఫోర్స్ సిబ్బంది వెంటనే ఆ బాలికను రక్షించి, సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ అమానవీయ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్దమయ్యారు. కేవలం 13 ఏళ్ల వయసు ఉన్న బాలికతో వెట్టిచాకిరీ చేయించుకోవడమే కాకుండా, అధికారుల తనిఖీ సమయంలో మంచం ర్యాక్ లో ఇరుకైన స్థితిలో దాచి ఉంచడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్ కు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.


Also Read:

మార్కెట్లో కల్తీ అల్లం.. కొనేముందు ఇది తెలుసుకోండి.!

ఇలాంటి పిల్లలు ఉన్న తల్లిదండ్రులు నిజంగా అదృష్టవంతులే

For More Latest News

Updated Date - Feb 04 , 2026 | 06:03 PM