ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు
ABN , Publish Date - Aug 01 , 2026 | 08:11 AM
అధికమాసం కారణంగా తిరుమలలో ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి టీటీడీ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు.
సెప్టెంబరు 15 నుంచి 23 వరకు
సాలకట్ల బ్రహ్మోత్సవాలు
అక్టోబరు 12 నుంచి 20 వరకు
నవరాత్రి బ్రహ్మోత్సవాలు
ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు
తిరుమల, జూలై 31(ఆంధ్రజ్యోతి): అధికమాసం కారణంగా తిరుమలలో ఈ ఏడాది శ్రీవారికి రెండు బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించి టీటీడీ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. సెప్టెంబరు 15 నుంచి 23వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబరు 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. రోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరగనున్నాయి.