Share News

కాణిపాకానికి కొత్త బస్సొచ్చింది..

ABN , Publish Date - Feb 21 , 2026 | 01:17 PM

న్యూటన్‌ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు తొలిసారిగా ప్రయాణికులను ఎక్కించుకొని తిరుపతి-కాణిపాకం మధ్య రెండు ట్రిప్పులు నడిచింది. పుణెలోని న్యూటన్‌ సంస్థలో తయారైన ఈ బస్సు రెండు వారాల కిందట తిరుపతికి చేరుకుంది.

కాణిపాకానికి కొత్త బస్సొచ్చింది..

తిరుపతి: న్యూటన్‌ ఎలక్ట్రిక్‌ ఏసీ బస్సు తొలిసారిగా ప్రయాణికులను ఎక్కించుకొని తిరుపతి-కాణిపాకం మధ్య రెండు ట్రిప్పులు నడిచింది. పుణెలోని న్యూటన్‌ సంస్థలో తయారైన ఈ బస్సు రెండు వారాల కిందట తిరుపతికి చేరుకుంది. ఆర్టీసీ అధికారుల అనుమతితో న్యూటన్‌ సంస్థ ప్రతినిధులు ఈనెల 11న తిరుపతి-కాణిపాకం మధ్య ట్రయల్స్‌ ప్రారంభించి పదిరోజుల పాటు నడిపారు. అధికారులు నిర్దేశించిన పదిరోజుల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ట్రయల్‌ విజయవంతమైంది.


nani3.jpgఈ నేపథ్యంలో అదే రూట్‌లో శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 2.30గంటలకు రెండు ట్రిప్పులు పూర్తి చేసుకుంది. ప్రయాణికుల పూర్తిసామర్థ్యంలో బస్సు నడిచినా ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. ప్రయాణికులు కూడా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా పదిరోజులపాటు ప్రయాణికులతో నడవనుంది. ఆ తర్వాత తిరుపతి-శ్రీకాళహస్తి, తిరుపతి-తిరుమల మధ్య పదిరోజుల చొప్పున ప్రయోగాత్మకంగా తిప్పనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

డ్రగ్స్‌పై ఈగల్ టీం ఉక్కుపాదం.. గంజాయి సాగును నిర్మూలించాం: ఐజీ రవికృష్ణ

పీఎస్ఎల్వీ-సీ62 వైఫల్యంపై విశ్లేషణ కమిటీ

Read Latest Telangana News and National News

Updated Date - Feb 21 , 2026 | 01:17 PM