Share News

ప్రజలను కన్ఫ్యూజ్ చేయడమే వాళ్ల పని.. జగన్‌పై వర్ల రామయ్య ఫైర్

ABN , Publish Date - Aug 22 , 2026 | 09:34 AM

మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు. పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ వివరాలను ఆధారాలతో సహా సీనియర్ ఐఏఎస్ అధికారులు వెల్లడించారని తెలిపారు.

ప్రజలను కన్ఫ్యూజ్ చేయడమే వాళ్ల పని.. జగన్‌పై వర్ల రామయ్య ఫైర్
Varla ramaiah

కృష్ణా జిల్లా, ఆగస్టు 22: మెగా డీఎస్సీలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధమని ఎమ్మెల్సీ వర్ల రామయ్య అన్నారు. గుడివాడలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీ వివరాలను ఆధారాలతో సహా సీనియర్ ఐఏఎస్ అధికారులు వెల్లడించారని తెలిపారు. అవకతవకలు జరిగాయంటూ వైసీపీ వేసిన 341 పిటిషన్లను హైకోర్టు కొట్టేసిందని.. దీంతో నిజం తేలిపోయిందని చెప్పారు. ‘ఓపెన్ డిబేట్‌కు రా.. లేదా అసెంబ్లీకి రా.. నీ అనుమానాలు క్లియర్ చేస్తా అని లోకేశ్ సవాల్ విసిరినా జగన్ నుంచి సమాధానం లేదు’ అంటూ విమర్శించారు.


తప్పు ఎక్కడ జరిగిందో చెప్పాలని అధికారులు మీడియా ముందు స్పష్టంగా చెబుతున్నా.. అధికారుల దగ్గరకు వెళ్లి ఇది తప్పు అని చెప్పలేని దుస్థితిలో వైసీపీ ఉందని ఎమ్మెల్సీ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బిజీ అయితే తమ ప్రతినిధులను పంపి అనుమానాలు తెలుసుకోవచ్చు కదా అని అన్నారు. ప్రజల్లో గందరగోళం సృష్టించడమే వాళ్ల పని అంటూ మండిపడ్డారు. సమాధానం చెప్పకుండా తాడు బొంగరం లేని బందర్ పిచ్చోడిని పంపిస్తున్నారని.. ప్రభుత్వంపై బురద చల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


కారుణ్య నియామకంలా ముఖ్యమంత్రి అయిన వ్యక్తి జగన్ అని.. నేరస్థులంటే ఆయనకు చాలా ఇష్టమని, పలకరించడానికి అత్యుత్సాహం చూపుతున్నారని రామయ్య విమర్శించారు. కౌరవుల మాదిరి జగన్ ఎప్పుడూ నేరస్థులు, దొంగలు, విధ్వంసకారుల పక్షమే అని.. అందుకే తల్లి, చెల్లి కూడా తోడు లేరన్నారు. జెన్-జీ అంటూ జగన్ పెట్టే మీటింగ్‌లో గంజాయి బ్యాచ్ ఉంటుంటే... రాష్ట్రంలో నిజమైన జెన్-జీలు లోకేశ్‌కు మద్దతు తెలుపుతున్నారని అన్నారు. జగన్ గ్రూప్-1 నిర్వహణపై సిట్ రిపోర్ట్ ఇచ్చిందని.. కోర్టు ఆదేశం వస్తే అన్నీ తేలుతాయన్నారు. విలువలు లేకుండా ప్రవర్తిస్తున్న జగన్ పతనం తప్పదని వర్ల రామయ్య హెచ్చరించారు.


ఇవి కూడా చదవండి...

మయన్మార్‌లో విషాదం.. బౌద్ధ ఆశ్రమంపై వైమానిక దాడి.. 14 మంది మృతి

ప్రియాంక కేసులో ముగిసిన నిందితుల కస్టడీ

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 22 , 2026 | 09:58 AM