14మందితో జనసేన ‘స్థానిక’ కమిటీ
ABN , Publish Date - Aug 22 , 2026 | 04:45 AM
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అనుసరించాల్సిన విధివిధానాలు రూపకల్పనకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ప్రకటించారు.
అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన అనుసరించాల్సిన విధివిధానాలు రూపకల్పనకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ప్రకటించారు. ఇందులో మంత్రి కందుల దుర్గేశ్, అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, దేవ వరప్రసాద్, సీ.హెచ్.వంశీకృష్ణ యాదవ్, లోకం మాధవి, పత్సమట్ల ధర్మరాజు, ఎంఎస్ఎంసీ చైర్మన్ టి.శివశంకర్, చిలకం మధుసూదన్రెడ్డి, కొటికలపూడి గోవిందరావు, సామినేని ఉదయభాను, యనమల భాస్కర్, కొరికాన రవికుమార్ ఉన్నారు.