Home » DSC
కష్టపడి చదివి డీఎస్సీ పరీక్షలు రాస్తే.. తమను అవమానిస్తున్నారంటూ వైసీపీ నేతలపై ఉపాధ్యాయులు మండిపడ్డారు. తమను అవమానిస్తే ఊరుకునేది లేదని ఆ పార్టీ నేతలను వారు హెచ్చరించారు.
ఏపీలో 16 వేలకుపైగా డీఎస్సీ ఉద్యోగాలను కూటమి ప్రభుత్వం పారదర్శకంగా భర్తీ చేసిందని మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి అన్నారు. మెరిట్ అభ్యర్థికి అన్యాయం జరగకూడదన్నదే చంద్రబాబు ప్రభుత్వ సిద్ధాంతమని స్పష్టం చేశారు.
మెగా డీఎస్సీ-2025లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ నేతలు సోమవారం చేపట్టిన నిరసనల్లో అసలైన అభ్యర్థులు ఒక్కరూ కనిపించలేదు. చాలా ప్రాంతాల్లో డీఎస్సీతో సంబంధం లేని ఇంటర్ విద్యార్థులను, వలస కూలీలను రంగంలోకి దింపి... వారంతా డీఎస్సీ అభ్యర్థులేనన్నట్టుగా వైసీపీ నేతలు కలరింగ్ ఇచ్చారు.
డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సోమవారం చేపట్టిన ర్యాలీలకు వైసీపీ నేతలు పడరానిపాట్లు పడ్డారు.
డబ్బుతో కాదు.. కష్టపడి చదివి, మెరిట్ ఆధారంగా ఉద్యోగం సాధించాం’ అని మెగా డీఎస్సీలో టీచరుగా ఎంపికైన సుజాత స్పష్టంచేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖల మంత్రి ఎస్. సవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డీఎస్సీ 2025 నిర్వహణపై విషప్రచారం మానుకోకుంటే ఉపాధ్యాయులంతా కదిలి సమరశంఖం పూరిస్తారని హెచ్చరించారు.
రాజ్యసభలో ఏపీ మెగా డీఎస్సీ అంశాన్ని ప్రస్తావించి రభస చేయడానికి వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రయత్నించారు. గురువారం రాజ్యసభలో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చ జరగగా వైసీపీ తరఫున వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు.
మెగా డీఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు మాజీ సీఎం జగన్కు లేదని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా లక్షలాది మంది నిరుద్యోగ యువతను జగన్ మోసం చేశారని విరుచుకుపడ్డారు.
డీఎస్సీపై మరో కుట్రకు వైసీపీ తెరలేపింది. తన అనుకూల సోషల్ మీడియా, తన అనుకూల వ్యక్తుల ద్వారా కమ్మ కులానికి టీచర్ పోస్టులంటూ తప్పుడు విశ్లేషణలని జగన్ బ్యాచ్ చేయిస్తోంది. 2014-19 మధ్య కాలంలో కమ్మ కులానికి చెందిన డీఎస్పీలకే ప్రమోషన్లు అంటూ నాడు తప్పుడు ప్రచారం చేసింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామక ప్రక్రియపై జగన్ చేసిన ఆరోపణలను ఖండించారు.