Home » DSC
ఉపాధ్యాయ నియామకాల భర్తీ ప్రక్రియకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డీఎస్సీకి ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ( TSTET ) నిర్వహించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు.
Andhrapradesh: డీఎస్సీ 2024 షెడ్యూల్ విషయంలో ఏపీ ప్రభుత్వం దిగొచ్చింది. హైకోర్టు ఆదేశానుసారం డీఎస్సీ పరీక్ష షెడ్యూల్లో మార్పులు చేస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం నాడు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటన చేశారు. మార్చి 25 నుంచి హాల్ టికెట్లు జారీ అవుతాయని.. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు పరీక్షల నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
Andhrapradesh: టెట్ , డీఎస్సీ పరీక్షలకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. టెట్ , డీఎస్సీ పరీక్షల మధ్య నాలుగు వారాలు కనీస సమయం ఉండాలని హైకోర్ట్ తీర్పునిచ్చింది. మార్చ్ 15 నుంచి ఇచ్చిన డీఎస్సీ షెడ్యూల్ను ధర్మాసనం సస్పెండ్ చేసింది. టెట్ పరీక్ష ఫలితాలు మార్చ్ 14న వస్తున్నాయని , మార్చ్ 15 నుంచి డీఎస్సీ పరీక్షలు పెట్టడంపై హైకోర్ట్లో పలువురు విద్యార్థులు పిటిషన్లు దాఖలు చేశారు.
Telangana DSC Notification 2024: తెలంగాణలో(Telangana) ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రానే వచ్చేంది. గత ప్రభుత్వం వేసిన పోస్టుల కంటే ఎక్కువ పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) రిలీజ్ చేస్తామని ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం(Congress) ఈ నోటిఫికేషన్ను జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). గత ప్రభుత్వం 5,089 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా..
మెగా డిస్సీకి నోటిఫికేషన్ వచ్చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం స్వయంగా సీఎం రేవంత్ గురువారం నోటిఫికేషన్ విడుదల చేశారు. గత ప్రభుత్వం 5,089 ఖాళీలతో విడుదల చేసిన నోటిఫికేషన్ను రేవంత్ సర్కారు రద్దు చేసి,
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యాశాఖ అధికారులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రేవంత్ నోటిఫికేషన్ విడుదల చేశారు.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత ఏడాది ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు (Dsc) చేసింది. గతేడాది సెప్టెంబర్లో 5,089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వ నోటిఫికేషన్ ఇచ్చింది. అయితే గత నోటిఫికేషన్ రద్దు చేస్తూ ‘కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్’ ఆదేశాలు జారీ చేశారు. త్వరలో కొత్త నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు పాఠశాల విద్య శాఖ వెల్లడింది.
Andhrapradesh: ఏపీలో 10 లక్షల మంది డీఎస్సీ అభ్యర్థులకు జరుగుతున్న అన్యాయంపై జైభీం రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ శనివారం ఆమరణ నిరహార దీక్ష చేపట్టారు. విజయవాడలో జడశ్రవణ్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అయనకు 100 మంది పార్టీ కార్యకర్తలు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా జడ శ్రవణ్ మాట్లాడుతూ.. డీఎస్సీ కోటిఫికేషన్లో గిరిజన అభ్యర్థులకు తీరని ఆన్యాయం జరుగుతుందని విమర్శించారు.
Andhrapradesh: ‘ఛలో సెక్రటేరియట్’ అంటే తమపై ఆంక్షలు ఎందుకు అంటూ ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?... వార్తలు రాస్తే దాడులు చేయిస్తారా అని విరుచుకుపడ్డారు. ‘‘నిరుద్యోగంపై అడిగితే మా పైనా , మీడియా పై దాడులా... సిగ్గుందా జగన్ నీకు’’ అంటూ షర్మిల ఫైర్ అయ్యారు.
Andhrapradesh: నిరుద్యోగుల సమస్యలపై ఈరోజు ఛలో సెక్రటేరియట్కు కాంగ్రెస్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే గత రాత్రి నుంచి ఏపీసీసీ చీఫ్ షర్మిల ఆంధ్రరత్న భవన్లోనే ఉండిపోయారు. అరెస్టు ఈరోజు ఉదయం 10 గంటలకు ఆంధ్రరత్న భవన్ నుంచి షర్మిల ఛలో సెక్రటేరియట్కు బయలుదేరి వెళ్లనున్నారు. అయితే పార్టీ కార్యాలయం నుంచి బయటకి వచ్చిన గిడుగు రుద్రరాజు, మస్తాన్ వలీలను పోలీసులు అరెస్ట్ చేశారు.