మద్యం స్కాం కేసులో మరో కీలక పరిణామం.. మరో నిందితుడిని విచారిస్తున్న సిట్
ABN , Publish Date - Mar 16 , 2026 | 01:02 PM
ఏపీ మద్యం స్కాం కేసులో మరో కీలక పరిణామంచోటుచేసుకుంది. ఈ కేసులో ఏ7 నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాశ్రెడ్డిని సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు.
అమరావతి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): ఏపీ మద్యం స్కాం కేసులో (AP Liquor Scam Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ7 నిందితుడిగా ఉన్న ముప్పిడి అవినాశ్రెడ్డిని సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్లో ఉన్న అతన్ని విజయవాడలోని సిట్ కార్యాలయానికి తరలించి ప్రశ్నిస్తున్నారు. మద్యం ముడుపుల వ్యవహారంలో షెల్ కంపెనీల ద్వారా భారీగా నగదు లావాదేవీలు జరిగాయని సిట్ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఈ నేపథ్యంలో ముప్పిడి అవినాశ్రెడ్డి పాత్రపై అధికారులు మరింత సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు.
విజయవాడ సిట్ కార్యాలయంలో విచారణ..
మద్యం కేసులో అరెస్టయిన ముప్పిడి అవినాశ్రెడ్డి గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కోర్టు అనుమతితో ఆయనను సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. అనంతరం భద్రతా ఏర్పాట్ల మధ్య అవినాశ్రెడ్డిని విజయవాడ సిట్ కార్యాలయానికి తరలించారు. అక్కడ ప్రత్యేక విచారణ గదిలో అధికారులు ఆయనను ప్రశ్నిస్తున్నారు. ఈ విచారణ రెండు రోజుల పాటు కొనసాగనుంది. రేపు, ఎల్లుండి కూడా ముప్పిడి అవినాశ్రెడ్డిని ప్రశ్నించనున్నారు. ఆయన నుంచి మరిన్ని కీలక వివరాలు రాబట్టాలని సిట్ అధికారులు భావిస్తున్నారు.
ఏ7 నిందితుడిగా ముప్పిడి అవినాశ్రెడ్డి..
ఈ కేసులో ముప్పిడి అవినాశ్రెడ్డి ఏ7 నిందితుడిగా ఉన్నారు. మద్యం ముడుపుల వ్యవహారంలో అతను కీలక పాత్ర పోషించినట్లు సిట్ విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అక్రమంగా వచ్చిన డబ్బును షెల్ కంపెనీల ద్వారా తరలించడం, లావాదేవీలు నిర్వహించడం వంటి కార్యకలాపాల్లో అతని పాత్ర ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. మద్యం వ్యాపారంలో వచ్చిన ముడుపులను వివిధ మార్గాల్లో తరలించేందుకు ప్రత్యేకంగా కొన్ని కంపెనీలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీల ద్వారా డబ్బును ఒకచోట నుంచి మరోచోటికి మళ్లించడం జరిగిందని సిట్ అధికారులు భావిస్తున్నారు.
ఏ–1 రాజ్ కసిరెడ్డికి సమీప బంధువు..
ముప్పిడి అవినాశ్రెడ్డి ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఏ1 రాజ్ కసిరెడ్డికి సమీప బంధువు అని సిట్ అధికారులు తెలిపారు. కుటుంబ సంబంధం కారణంగానే మద్యం అక్రమాల వ్యవహారంలో అతనికి కీలక బాధ్యతలు అప్పగించినట్లు అనుమానిస్తున్నారు. రాజ్ కసిరెడ్డి నిర్వహించిన వ్యాపార కార్యకలాపాల్లో అవినాశ్రెడ్డి కీలకంగా పాల్గొన్నారని సమాచారం. ముఖ్యంగా అక్రమంగా వచ్చిన డబ్బును భద్రపరచడం, మళ్లించడం, షెల్ కంపెనీల ద్వారా అకౌంట్లలో చూపించడం వంటి వ్యవహారాల్లో అతని పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మద్యం ముడుపుల తరలింపు
మద్యం ముడుపులను నేరుగా తరలించకుండా వాటిని పలు కంపెనీల పేర్లతో లావాదేవీలు జరిపినట్లు చూపించి అక్రమంగా మళ్లించినట్లు తెలుస్తోంది. ముప్పిడి అవినాశ్రెడ్డి షెల్ కంపెనీల నిర్వహణలో కీలకంగా వ్యవహరించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పలు కంపెనీల ఖాతాల ద్వారా భారీ మొత్తంలో డబ్బు బదిలీలు జరిగాయని అధికారులు గుర్తించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జనసేన బలోపేతానికి కృషి : నాగబాబు
బాబోయ్ పెద్దపులి… 16 రోజులుగా గ్రామాల్లో సంచారం
ఫామ్ హౌస్లో డ్రగ్స్ పార్టీ గుట్టురట్టు.. 11 మంది అరెస్ట్
Read Latest AP News And Telangana News And International News And Telugu News