Share News

అంబటి రాంబాబుపై సీఐడీ కేసు

ABN , Publish Date - Aug 01 , 2026 | 08:30 AM

వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు సంకెళ్లు వేసినట్లు ఆయన అభ్యంతరకర వీడియోను రూపొందించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.

అంబటి రాంబాబుపై సీఐడీ కేసు
Ambati Rambabu

గుంటూరు, జూలై 31(ఆంధ్రజ్యోతి): వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌కు సంకెళ్లు వేసినట్లు ఆయన అభ్యంతరకర వీడియోను రూపొందించి సోషల్‌ మీడియాలో పోస్టు చేశారని టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. పెమ్మసానిని కించపరిచేలా, ఆయన ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరించిన అంబటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గుంటూరు ఎస్పీ వకుల్‌ జిందాల్‌, మంగళగిరిలోని సీఐడీ అదనపు డీజీ కార్యాలయంలో ఎస్పీ రెడ్డి గంగాధర్‌కు శుక్రవారం వారు ఫిర్యాదు చేశారు.

Updated Date - Aug 01 , 2026 | 08:30 AM