అమృతానందమయి ఆశ్రమాన్ని సందర్శించిన మంత్రి లోకేశ్
ABN , Publish Date - Sep 04 , 2026 | 05:47 PM
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ కేరళంలో శుక్రవారం పర్యటించారు. కేరళంలోని పూజ్య శ్రీ మాతా అమృతానందమయి అమృతపురి ఆశ్రమాన్ని ఆయన సందర్శించారు.
ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 4, (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) కేరళంలో ఈరోజు (శుక్రవారం) పర్యటించారు. కేరళంలోని పూజ్య శ్రీ మాతా అమృతానందమయి అమృతపురి ఆశ్రమం, అందులోని కాళీ ఆలయాన్ని ఆయన సందర్శించారు. ఈ ఆశ్రమంలో సుమారు మూడు గంటల పాటు గడిపి ఆశ్రమ వివరాలను లోకేశ్ తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అమృతానందమయి ఆశీస్సులు అందుకోవడం ఎంతో ఆధ్యాత్మిక సంతృప్తినిచ్చిందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్(X)లో ఆయన పోస్టు పెట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీ అన్నింట్లోనూ క్రెడిట్ చోరీకి యత్నిస్తోంది: సీఎం చంద్రబాబు
చట్టాన్ని ఉల్లంఘించిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు: మంత్రి లోకేశ్
గుంటూరు జిల్లా పోలీసులపై ఏపీ హైకోర్టు సీరియస్
Read Latest Telangana News And AP News And National News
And Telugu News