Operation sindoor: భారత్ మెరుపు దాడులపై స్పందించిన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్
ABN, Publish Date - May 07 , 2025 | 07:54 AM
భారత్ మెరుపు దాడులపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ స్పందించారు. సమయం చూసుకుని బదులుగా స్పందిస్తామని ప్రధాని షెహబాజ్ అన్నారు. భారతదేశం పాకిస్థాన్లో 5 ప్రాంతాల్లో దాడులు చేసిందని చెప్పారు.
భారతదేశం ఆపరేషన్ సింధూర్ (Operation Sindhoor) పేరిట పాకిస్తాన్పై మెరుపు దాడులు చేసింది. ఈ దాడులపై పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ (Pakistan PM Shehbaz Sharif) స్పందించారు. సమయం చూసుకుని బదులుగా స్పందిస్తామని ప్రధాని షెహబాజ్ అన్నారు. భారతదేశం పాకిస్థాన్లో 5 ప్రాంతాల్లో దాడులు చేసిందని చెప్పారు. భారత్ చర్యలకు పాకిస్థాన్ కచ్చితంగా బదులు తీర్చుకుంటుందని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్థాన్, ఆర్మీకి తెలుసునని షెహబాజ్ షరీఫ్ అన్నారు. భారతదేశం ప్రణాళికలను ఎట్టి పరిస్థితుల్లోనూ నెరవేరనీయమని పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. భారత్ దాడులను యుద్ధ చర్యలుగా పాక్ ప్రధాని షెహబాజ్అభివర్ణించారు.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఈ వార్తలు కూడా చదవండి
India Pak War: పాకిస్తాన్పై మెరుపుదాడి, 30 మంది ఉగ్రవాదులు హతం..
For National News And Telugu News
Updated at - May 07 , 2025 | 09:18 AM