Share News

Telangana Government: నెరవేరనున్న పదేళ్ల ఆకాంక్ష ... తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం

ABN , Publish Date - May 09 , 2025 | 09:50 PM

Telangana Government: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం నాడు నిమ్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్‌ నిర్వహించారు. ఆరోగ్యశ్రీ ఇన్‌సెంటివ్ ఇచ్చేందుకు మంత్రి దామోదర రాజనర్సింహ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చారు.

Telangana Government: నెరవేరనున్న పదేళ్ల ఆకాంక్ష ... తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
Telangana Government

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ తెలిపింది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఇవాళ(శుక్రవారం) నిమ్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్‌ నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నిమ్స్ 2024 ప్రగతి నివేదికను దామోదర రాజనర్సింహకు నిమ్స్ డైరెక్టర్ బీరప్ప అందజేశారు. నిమ్స్‌లో మెరుగైన వైద్య సేవలు, ఓపీ, ఐపీ సేవలు పెరిగాయని అన్నారు. ఏడాదిలో పెద్ద సంఖ్యలో రొబొటిక్ సర్జరీలు జరిగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్లు, సిబ్బందిని మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. ఆరోగ్యశ్రీ ఇన్‌సెంటివ్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడంతో నిమ్స్ డాక్టర్లు, స్టాఫ్‌ పదేళ్ల ఆకాంక్ష నెరవేరింది.


ఆరోగ్యశ్రీ పేషెంట్లకు‌ చికిత్స అందించినందుకుగానూ వచ్చే డబ్బుల్లో 35 శాతం ఇకపై డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ప్రభుత్వం అందజేయనుంది. ఈ మేరకు నిమ్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ ఆమోదం తెలిపారు. 2023 కంటే 2024లో అవుట్ పేషెంట్ల సంఖ్య 12.6 శాతం పెరిగిందని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. ఆరోగ్యశ్రీ కింద అడ్మిట్ అయిన పేషెంట్ల సంఖ్య 22.4 శాతానికి పెరిగిందని చెప్పారు.


అయితే నిమ్స్‌లో చికిత్స కోసం 2024లో 11వేల మంది పేదలకు ఎల్‌వోసీల ద్వారా చికిత్స చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2023లో కేవలం 5800 మందికి మాత్రమే ఎల్‌వోసీ కింద చికిత్సలు చేసింది. గతేడాది కాలంలో నిమ్స్‌లో సుమారు 350 రోబొటిక్ సర్జరీలు చేశారు. సుమారు 800లకు పైగా పోస్టుల భర్తీకి మంత్రి అనుమతి ఇచ్చారు. ఇందులో డాక్టర్లు, నర్సులు సహా అన్ని రకాల పోస్టులు ఉన్నాయి. నిమ్స్ కొత్త బిల్డింగుల నిర్మాణ పనులపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆరా తీశారు. పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి

Operation Sindoor: భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు.. ఉన్నతాధికారులతో రక్షణ మంత్రి కీలక భేటీ..

Operation Sindoor: ఉద్రిక్త పరిస్థితుల వేళ.. జమ్మూలో పర్యటించిన సీఎం

Operation Sindoor: మాజీ సీఎం కన్నీటి పర్యంతం.. ఎందుకంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 09 , 2025 | 09:59 PM