Home » NIMS
Telangana Government: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శుక్రవారం నాడు నిమ్స్ ఎగ్జిక్యూటివ్ బోర్డు మీటింగ్ నిర్వహించారు. ఆరోగ్యశ్రీ ఇన్సెంటివ్ ఇచ్చేందుకు మంత్రి దామోదర రాజనర్సింహ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
నిమ్స్ వైద్యులు 2024 నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్-ఎస్ఎస్)లో అద్భుతమైన ర్యాంకులు సాధించారు. డాక్టర్ జకీర్ హుస్సేన్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ను సాధించడం విశేషం
Nims fire incident: నిమ్స్ అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి పంజాగుట్ట పోలీసులు విచారణ చేపట్టారు. అయితే వారి విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రి ఆరోగ్య శ్రీ సిబ్బందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. బాణసంచాను అక్రమంగా నిల్వచేశారంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. దీనిపై ఫిర్యాదులు రావడంతో పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు.
నిమ్స్ ఆస్పత్రిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఎమర్జెన్సీ విభాగంలో అగ్ని ప్రమాదం జరిగింది. ఆస్పత్రిలోని 5వ అంతస్తులో మంటలు చెలరేగాయి.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సాంకేతికతను ఎక్స్రే, ఈసీజీ విశ్లేషణకు ఉపయోగించడానికి కసరత్తు ప్రారంభించారు
లాలూ యాదవ్కు గత రెండ్రోజులుగా ఆరోగ్యం బాగోలేదు. బుధవారం ఉదయం పరిస్థితి మరింత దిగజారడం కుటుంబసభ్యులు, మద్దతుదారుల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా చాలాకాలంగా ఆయన వైద్యచికిత్సలు తీసుకుంటుండటం ప్రధాన కారణంగా చెబుతున్నారు.
హైదరాబాద్లోని నిమ్స్ ఆస్పత్రి వైద్యులు రోబోటిక్ కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ద్వారా 33 ఏళ్ల రోగికి కొత్త జీవితం ప్రసాదించారు. ఈ చికిత్సను ‘ఆరోగ్యశ్రీ పథకం’ కింద ఉచితంగా నిర్వహించడం విశేషం.
రాష్ట్రంలో పట్టుమని పాతికేళ్లకే మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. గతంలో రక్తపోటు, మధుమేహం బారిన పడ్డవారు కిడ్నీలు దెబ్బతిని 50-60 ఏళ్ల వయసులో ఆస్పత్రులకు వెళ్లేవారు.
నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) నుంచి వ్యక్తిగత కారణాలతోనే వైద్యులు వెళ్లిపోతున్నారని ఆ సంస్థ డైరెక్టర్ డా.ఎన్.బీరప్ప తెలిపారు. ‘నిమ్స్కు వైద్యుల టాటా’ పేరిట గురువారం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన కథనానికి ఆయన వివరణ ఇచ్చారు.