Home » NIMS
పిల్లలకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిజామ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. నిమ్స్లో ఈ నెల 13 (గురువారం) నుంచి శస్త్రచికిత్సలు ప్రారంభం కానున్నాయని వెల్లడించారు.
హైదరాబాద్లోని పంజాగుట్ట నిమ్స్ ఆస్పత్రిలో దారుణం జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స కోసం వచ్చిన యువతిపై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది.
నిమ్స్లో రెండున్నరేళ్లలో 1,000 రొబోటిక్ సర్జరీలు పూర్తి అయ్యాయని తెలంగాణ మంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో నిమ్స్ వైద్య బృందం మంత్రిని కలిశారు.
కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్లో అరుదైన మైలురాయిని అందుకున్న నిమ్స్ వైద్య బృందానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. హైదరాబాద్లోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(NIMS) కిడ్నీ మార్పిడిలలో దేశంలోనే అరుదైన రికార్డు నమోదు చేసింది.
నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను మంత్రి దామోదర రాజనర్సింహ పరామర్శించారు. ఆమె ఆరోగ్య పరిస్థితిపై అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
పేద ప్రజలకు అత్యాధునిక వైద్యాన్ని అందించాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వ్యాఖ్యానించారు. అమెరికాకు చెందిన తులసి థెరప్యుటిక్స్ సహకారంతో ఈ ల్యాబ్ను ఏర్పాటు చేసుకున్నామని వెల్లడించారు.
నిమ్స్లోనే బీఎస్సీ నర్సింగ్ చేస్తున్నాడు. అయితే మరికొద్ది రోజుల్లో ఇంటర్నెట్ షిప్ పూర్తవుతుందనుకున్న సమయంలో నితిన్ ఇలా చనిపోవడం సహచరులను షాక్కు గురిచేసింది.
నిమ్స్ ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతోంది. మునుపెన్నడూ లేని విధంగా అవుట్ పేషెంట్ (ఓపీ)కు రద్దీ పెరుగుతోంది. గడిచిన మూడు రోజుల్లో 11,590 మంది రోగులు రాగా, మంగళవారం ఒక్కరోజే 4,055 మంది ఓపీ చికిత్సలు పొందారు. నిమ్స్ ఏర్పడిన తర్వాత ఈ స్థాయిలో రోగులు రావడం ఇదే ప్రథమం.
లివర్ పాడైనా, మోకాలి చిప్ప అరిగినా అధైర్యపడొద్దని, శస్త్ర చికిత్సతో పనిలేకుండానే ఇంజెక్షన్ ద్వారా లివర్కు పునరుజ్జీవం పోయోచ్చని నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) వైద్యులు అంటున్నారు.
కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మృతుల సంఖ్య పదికి పెరిగింది. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురై నిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆసోది కురుమయ్య (59) ఈ నెల 10న చికిత్స పొందుతూ మరణించారు.