Hyderabad : పోలీసుల ఆధ్వర్యంలో పీపుల్స్ ప్లాజా రన్ ఫర్ యాక్షన్-2025..
ABN, Publish Date - Mar 08 , 2025 | 12:11 PM
Hyderabad Police : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని హైదరాబాద్ పోలీసులు పీపుల్స్ ప్లాజా నుంచి రన్ ఫర్ యాక్షన్-2025 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క విచ్చేశారు. రన్ ఫర్ యాక్షన్లో..

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పోలీసులు పీపుల్స్ ప్లాజా నుంచి రన్ ఫర్ యాక్షన్-2025 కార్యక్రమం నిర్వహించారు.

హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో జరిగిన రన్ ఫర్ యాక్షన్-2025 కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా విచ్చేశారు. రన్ ఫర్ యాక్షన్ 2025 ని జెండా ఊపి ప్రారంభించారు.

5k రన్, 2k రన్ పోటీల్లో యువతీయువకులు, మహిళలు, పురుషులు ఉత్సాహంగా పాల్గొన్నారు. పరుగు పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందించారు.

ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, అడినల్ సీపీ విక్రమ్ మాన్, అడిషనల్ సీపీ క్రైమ్స్ విశ్వ ప్రసాద్ సహా ఇతర డీసీపీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మహిళలకు మంచి స్ట్రెంత్ ఇచ్చేలా ఈ రన్ ఏర్పాటు చేసినందుకు పోీలీసులకు అభినందనలు తెలిపారు మంత్రి సీతక్క. అలాగే ఈ కార్యక్రమంలో ప్రసంగిస్తూ సీపీ సీవీ ఆనంద్ సీతక్కను ఉమెన్ ఆఫ్ స్ట్రగుల్ అంటూ కొనియాడారు.
Updated at - Mar 08 , 2025 | 12:15 PM