Home » Hyderabad CP
Telangana: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్పై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఫేక్ వీడియోకు సంబంధించి సోషల్ మీడియాలో సర్కులేషన్పై అందిన ఫిర్యాదు నేపథ్యంలో మొత్తం 27 కేసులు నమోదు చేసినట్లు తెలపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసామని... వారు కండిషన్ బెయిల్పై బయటకు వచ్చినట్లు చెప్పారు. వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్స్, లాప్టాప్స్ సీజ్ చేశామన్నారు.
Telangana: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోందన్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయలేదని సపష్టం చేశారు. ఊహాగానాలతో దర్యాప్తును ఇబ్బంది పరుస్తున్నారని అన్నారు. రాజకీయ నేతల ప్రమేయంపై కూడా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.
శ్రీరామనవమి శోభయాత్ర నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర పోలీసు కమిషనర్ బుధవారం వెల్లడించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు.
శ్రీరామనవమి శోభాయాత్ర నేపథ్యంలో హైదరాబాద్ సీపీ.. నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. మంగళ్హాట్లో అన్ని ప్రభుత్వ విభాగాల కో ఆర్డినేషన్ మీటింగ్ జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో పాటు పోలీసు అధికారులు, జీహెచ్ఎంసీ, విద్యుత్ వాటర్ వర్క్స్, అగ్నిమాపక శాఖ అధికారులు హాజరయ్యారు.
Telangana: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎంతటి దుమారాన్ని రేపుతుందో అందరికీ తెలిసిందే. రాజకీయ నేతల ఫోన్లను ట్యాపింగ్ చేశారనే వార్త రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించింది. ఈ కేసులో ఆనాటి పోలీసు ఉన్నతధికారులు అరెస్ట్ అవగా.. వారి రిమాండ్ రిపోర్ట్లో అనేక కీలక విషయలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా ఈ వ్యవహారంపై హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి మొదటిసారి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు పారదర్శకంగా విచారణ కొనసాగుతోందన్నారు.
సినీ నిర్మాత అంజిరెడ్డి హత్య కేసు విచారణలో పోలీసుల విచారణ తీరుపై అనుమానాలు వచ్చాయి. ఊహించినట్టుగానే నిర్మాత అంజిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని తెలిసింది. హత్య చేసి దానిని ప్రమాదంగా చిత్రీకరించారని ఆ తర్వాత జరిపిన విచారణలో తేటతెల్లం అయ్యింది. దీంతో గోపాలపురం ఏసీపీ సుధీర్ బాబును సస్పెండ్ చేశారు
Telangana: హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ను ప్రక్షాళన చేస్తూ సీపీ ఆదేశాలు జారీ చేశారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని మార్చేస్తూ సీపీ నిర్ణయం తీసుకున్నారు.
Telangana: బంజారాహిల్స్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో ప్రభుత్వ విభాగాల సమన్వయ సమావేశం శనివారం ఉదయం ప్రారంభమైంది. హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతోంది.
Telangana: హైదరాబాద్ సీపీగా కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు అయిన తరువాత శ్రీనివాస్రెడ్డికి ప్రాధాన్యత గల పోస్టింగ్ మొదటి సారి వచ్చింది.
Telangana: కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐపీఎస్ బదిలీలకు మొదటి సారి శ్రీకారం చుట్టారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో కమిషనర్లను బదిలీ చేస్తూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.