Share News

Nitin Gadkari NHAI: NHAI రికార్డు.. ఆస్తులు రూ.1.42 లక్షల కోట్లపైనే : గడ్కరీ

ABN , Publish Date - Aug 22 , 2025 | 11:06 AM

2025 ఆర్థిక సంవత్సరం నాటికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) వివిధ పద్ధతుల ద్వారా ప్రభుత్వం రూ.1,42,758 కోట్లు సేకరించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం పార్లమెంటులో తెలియజేశారు.

Nitin Gadkari NHAI: NHAI రికార్డు.. ఆస్తులు రూ.1.42 లక్షల కోట్లపైనే : గడ్కరీ
NHAI Monetization Drive Crosses ₹1.42 Lakh Crore

2024-25 ఆర్థిక సంవత్సరం వరకు వివిధ రకాల పద్ధతుల్లో మోనటైజేషన్ చేయడం ద్వారా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) మొత్తం రూ.1,42,758 కోట్లను సేకరించింది. ఈ సమాచారాన్ని గురువారం కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంటులో వెల్లడించారు. ప్రభుత్వం హైవే ఆస్తులను టోల్ ఆపరేట్ అండ్ ట్రాన్స్‌ఫర్ (ToT), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (InvIT), సెక్యూరిటైజేషన్ (SPV ద్వారా ప్రాజెక్ట్ ఆధారిత ఫైనాన్సింగ్) అనే మూడు పద్ధతుల ద్వారా మానిటైజేషన్ చేస్తుందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.30,000 కోట్ల లక్ష్యాన్ని సాధించాలని నిర్ణయించినట్లు ఆయన లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు.


2024-25 వరకు సేకరించిన మొత్తంలో, ToT రూ.48,995 కోట్లు, InvIT రూ.43,638 కోట్లు, సెక్యూరిటైజేషన్ ఖాతాలు రూ.50,125 కోట్లు అందించాయని ఆయన లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఇచ్చారు. టోట్ మోడ్ కింద ఓపెన్ మార్కెట్ బిడ్లను ఆహ్వానిస్తున్నామని కేంద్ర మంత్రి గడ్కరీ పేర్కొన్నారు. రోడ్ స్ట్రెచ్‌లను అత్యధిక బిడ్డర్‌కు రాయితీ కాలానికి (15-30 సంవత్సరాలు) ప్రదానం చేస్తారని.. వారి ఆఫర్ రిజర్వ్ ధర కంటే ఎక్కువగా ఉండాలని అన్నారు.


లోక్‌సభలో మరో ప్రశ్నకు నితిన్ గడ్కరీ సమాధానమిస్తూ, 2025లో రోడ్డు ప్రమాద బాధితుల కోసం నగదు రహిత చికిత్స పథకం పైలట్ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. మార్చి 2024 నుంచి జూలై 31, 2025 మధ్య ఆరు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఈ స్కీం కింద 4,971 మంది రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్స అందించామని వెల్లడించారు.


ఇవి కూడా చదవండి..

పార్లమెంట్‌లోకి ఆగంతకుడు.. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది

సరిహద్దు వివాదం.. కీలక నిర్ణయం: భారత్‌లో చైనా రాయబారి

For More National News

Updated Date - Aug 22 , 2025 | 12:24 PM