Share News

Hyderabad: ఆన్‌లైన్‌లో మెడిసిన్‌ కోసం వెదికితే రూ.2.25 లక్షలు కొట్టేశారు..

ABN , Publish Date - May 10 , 2025 | 07:04 AM

సైబర్ నేరగాళ్లు మరో కొత్త మోసానికి తెరలేపారు. ఆన్‌లైన్‌లో మెడిసిన్‌ కోసం వెదికుతున్న వ్యక్త నుంచి రూ.2.25 లక్షలు కొట్టేశారు. ప్రతిరోజూ హైదరాబాద్ నగరంలో సైబర్ మోసానికి ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు. ఈ తరహ మోసాలపై ప్రజల్లో ఒకింత అవగాహన తక్కువగా ఉండటంతో ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు.

Hyderabad: ఆన్‌లైన్‌లో మెడిసిన్‌ కోసం వెదికితే రూ.2.25 లక్షలు కొట్టేశారు..

- సైబర్‌ నేరగాళ్లకు చిక్కిన విద్యార్థి

హైదరాబాద్‌ సిటీ: ఔషధాల కోసం ఆన్‌లైన్‌లో వెదికి సైబర్‌ నేరగాళ్ల(Cyber ​​criminals) మోసానికి ఓ విద్యార్థి గురయ్యాడు. రూ.2.25 లక్షలు పోగొట్టుకున్నాడు. సైబర్‌క్రైం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నగరానికి చెందిన 23 ఏళ్ల విద్యార్థి ఈనెల 4న ఓ మెడిసిన్‌ కోసం గూగుల్‌(Google)లో వెదికాడు. ఆ మెడిసిన్‌ ధర యూనిట్‌కు దాదాపు రూ.5000గా ఉంది. హోల్‌సేల్‌ దుకాణాల్లో అయితే ధర తగ్గుతుందని వాటి కోసం వెదుకుతుండగా కొన్ని ఫోన్‌ కాల్స్‌ చేశాడు. ఆ ఔషధాన్ని హోల్‌సేల్‌ ధరకు అమ్ముతామని ఓ వ్యక్తి మాట్లాడాడు.

ఈ వార్తను కూడా చదవండి: Adilabad: గుండెపోటుతో సివిల్‌ కాంట్రాక్టర్‌ మృతి


city1.2.jpg

దాని ధర తగ్గదని చెప్పడంతో బాధితుడు తనకు అవసరమైన ఐదు యూనిట్ల మెడిసిన్‌ కోసం రూ.25వేలను చెప్పిన బ్యాంక్‌ ఖాతాకు బదిలీ చేశాడు. మెడిసిన్‌ డెలివరీ కాకపోవడంతో ఆ నంబర్‌కు ఫోన్‌ చేసి ఆర్డర్‌ను రద్దు చేయాలని అభ్యర్థించాడు. అవతలి వ్యక్తితో ఫోన్‌ మాట్లాడుతుండగానే తన తల్లి ఫొటో ఉన్న నంబర్‌ నుంచి ఒక ఏపీకే లింక్‌ వచ్చింది. బాధితుడు దాన్ని క్లిక్‌ చేయగానే బ్యాంకు ఖాతా నుంచి రూ. 2.25లక్షలు డెబిట్‌ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. దీంతో బాధితుడు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


ఈ వార్తలు కూడా చదవండి

Drone Attacks: ఉద్రిక్తంగానే..

Miss World 2025: మిస్‌వరల్డ్‌ పోటీలకు 5వేల మందితో భద్రత

Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

Lavu Sri Krishna Devarayalu: తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి

Operation Sindoor: యుద్ధ బీభత్సం

Read Latest Telangana News and National News

Updated Date - May 10 , 2025 | 08:19 AM