Home » Cyber attack
హైదరాబాద్కు చెందిన పలువురిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించి లక్షలాది రూపాయలను కొట్టేసిన విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం రూ.8.24 లక్షలను కొల్లగొట్టారు. తమ ఖాతాల్లో ఉన్న నగదు మాయం కావడంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది. నకిలీ యాప్ ల ద్వారా మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త ఎత్తుగడలతో మోసాలకు పాల్పడుతున్నారు. పెరిగిన సాంకేతికతను ఉపయోగించుకుంటూ ప్రజలను నిలువునా దోచేస్తున్నారు. అయితే.. ఈ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది,
సైడర్ కేటుగాళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. అందంగా ఉన్న అమ్మాయిల ఫొటోలు వాట్సాప్ డీపీగా పెట్టి వలపు వల విసిరి... లక్షల రూపాయలను కొల్లగొడుతున్నారు. తాజాగాగా ఇటువంటా సంఘటనే నగరంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.
సైబర్ మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే ప్రతి ఏటా రూ.1500 కోట్ల నగదును కొల్లగొడుతున్నారు. పెరిగిన సాంకేతిక రంగాన్ని ఉపయెగిచుకుంటూ అడ్డంగా దోచేస్తున్నారు. ప్రజల్లో ఈ సైడర్ మోసాలపై అవగాహన తక్కువగా ఉండడంతో ఈ మోసాలకు అడ్డే లేకుండా పోతోంది.
ఓ వృద్ధుడు సైబర్ మోసగాళ్ళ చేతిలో బలైపోయాడు. రూ.1.36లక్షలను పోగోట్లుకున్నాడు. హైదరాబాద్ నగరంలోని గాంధీనగర్కు చెందిన వృద్ధుడొకరు అమెజాన్ కస్టమర్ కేర్ నంబర్ కోసం గూగుల్లో వెతికి సైబర్ నేరాగాళ్ల చేతిలో దారుణంగా మోసపోయాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
సైబర్ ముఠా గుట్టును భీమవరం పోలీసులు రట్టు చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ దొంగలు రిటైర్డ్ ప్రొఫెసర్ శర్మను బెదిరించి.. రూ.78 లక్షలు కాజేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి.. నిందితులను అరెస్ట్ చేశారు.
టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన పేరుతో చాట్ జరుగుతుందని, ఆ నెంబర్ ను వెంటనే బ్లాక్ చేయండి అంటూ ఆమె ట్వీట్ చేసింది.
సైబర్ నేరగాళ్లు సరికొత్త పంధాను ఎంచుకున్నారు. సోషల్ మీడియాలో, వాట్సాప్లో బ్యాంకులు, ప్రభుత్వ సేవల పేర్లతో సైబర్ నేరగాళ్లు ఏపీకే లింక్లు పంపుతున్నారు. ఈ లింక్లను ఓపెన్ చేస్తే.. ఖాతాలో ఉన్న నగదు మొత్తం మాయమైపోతోంది. ఈ తరహ మోసాలపై జాగ్రత్తగా ఉండాలని పోలీస్ యంత్రాంగం సూచిస్తోంది.
తన డిపార్ట్మెంట్ ఉద్యోగి పంపిన లింక్ను ఓపెన్ చేసిన ఓ వీఆర్ఓ రూ.1.19 లక్షలు పోగొట్టుకున్న సంఘటన పెనుకొండలో ఆలస్యంగా వెలుగుచూసింది. బాధితురాలైన వీఆర్ఓ యశస్విని తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
సైబర్ మోసాల కేసుల్లో కీలక పాత్రధారులు తప్పించుకుంటున్నారు. నేరగాళ్లకు బ్యాంకు ఖాతాలను ఇచ్చిన వారిని మాత్రమే పోలీసులు అరెస్టు చేయగలుగుతున్నారు. ఈ క్రమంలో సైబర్ క్రైం విభాగం దర్యాప్తు తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.