Home » Cyber attack
వృద్ధులే టార్గెట్గా సైబర్ నేరగాళ్లు భారీ మోసాలకు పాల్పడుతున్నారని.. అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్ సూచించారు.19 నెలల్లో సీనియర్ సిటిజన్ల నుంచి రూ.102.02 కోట్లను కేటుగాళ్లు కాజేశారని పేర్కొన్నారు.
మచిలీపట్నంలో సైబర్ కేటుగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఢిల్లీ పోలీసులమంటూ వృద్ధురాలికి వాట్సాప్ కాల్ చేశారు. వృద్ధురాలి అకౌంట్ నుంచి రూ.1.43కోట్లు మాయం చేశారు.
సైబర్ సెక్యూరిటీ బ్యూరో చీఫ్ శిఖా గోయల్పై ఎక్స్లో గుర్తుతెలియని వ్యక్తి అభ్యంతరకర పోస్ట్ పెట్టారు. ఐపీఎస్ అధికారిణి శిఖా గోయల్ను సోషల్ మీడియా వేదికగా తీవ్ర పదజాలంతో దూషించాడు.
సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు తమ ట్రెండ్ను మారుస్తున్నారు. మొబైల్ నంబర్లను హ్యాక్ చేసి.. ఆ నంబర్ నుంచి తెలిసినవారికి, వాట్సాప్ గ్రూప్లకు లింకులు పంపించి పెట్టుబడులు పెట్టండంటూ పోస్టులు పెడుతున్నారు.
వాట్సాప్ గ్రూపులో పెట్టుబడుల పేరుతో నిర్వహించిన సైబర్ మోసంలో ఓ రిటైర్ట్ ఉద్యోగి తన జీవితకాల పొదుపులతో పాటు రుణం కలిపి మొత్తం రూ.33 లక్షలు కోల్పోయాడు.
విదేశీ పెట్టుబడుల పేరుతో ఓ ప్రైవేట్ ఉద్యోగిని సైబర్ మోసగాళ్లు బురిడీ కొట్టించారు. భారీ లాభాలు వస్తాయంటూ నమ్మించి బాధితుడి నుంచి ఏకంగా రూ.1.10 కోట్లు కాజేశారు.
వాట్సాప్ గ్రూపుల ద్వారా స్టాక్ మార్కెట్లో భారీ లాభాలు వస్తాయని నమ్మించి రూ.16.35 లక్షలకు పైగా సైబర్ నేరగాళ్లు కాజేశారు.
గ్రేటర్ పరిధిలో సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలతో రెచ్చిపోతున్నారు. ఆన్లైన్ టాస్కులు, రివ్యూల పేరుతో పార్ట్ టైమ్ ఉద్యోగాలంటూ అమాయకులను బురిడీ కొట్టిస్తున్నారు.
మీపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని, ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తామని విశ్రాంత ఎయిర్ఫోర్స్ ఉద్యోగిని బెదిరించిన సైబర్ నేరగాళ్లు రూ.33.50 లక్షలు కొల్లగొట్టారు.
వ్యాపార లావాదేవీల్లో సరఫరాదారు పేరుతో నకిలీ ఈ-మెయిల్ పంపి బ్యాంకు ఖాతా వివరాలను మార్చి రూ.4.30 లక్షలు కాజేసిన ఘటన సైబరాబాద్లో వెలుగుచూసింది.