Home » Cyber attack
కీలక కేసుల పరిష్కారానికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిందితులకు త్వరగా శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అంతర్జాతీయ సైబర్ క్రైమ్ నెట్వర్క్ను ఏపీ సీఐడీ పోలీసులు చేధించారు. కంబోడియా నుంచి సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడిన నిందితుడిని గుర్తించి 1400 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. డైరక్టరేట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సహకారంతో భారీ క్రైమ్ నెట్వర్క్ను చేధించారు ఏపీ సీఐడీ అధికారులు.
సైబర్ నేరగాళ్లు కొత్త మార్గంలో మోసాలకు పాల్పడుతున్నారు. తెలంగాణ ట్రాఫిక్ పోలీస్ పేరుతో లింకులు పంపి అవి ఓపెన్ చేయడం ద్వారా ఖాతాలను కొల్లగొట్టేస్తున్నారు. ఈ వ్యవహారంపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు మరో కొత్త మోసానికి తెరలేపారు. అమ్మాయితో న్యూడ్ వీడియో కాల్ చేయించి.. ఆ తర్వాత బెదింపులకు పాల్పడుతున్నారు. తాజాగా నగరానికి చెందిన ఓ యువకుడు ఈ తరహ మోసానికి బలైపోయి రూ.3.41 లక్షలు పోగొట్టుకున్నాడు. వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్ మహానగరంలో సైబర్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. ప్రతిరోజూ ఎవరో ఒకరు, ఎక్కడో ఓ చోట ఈ మోసానికి బలవుతూనే ఉన్నారు. అయితే.. అప్రమత్తతే దీనికి అసలైన మందు అని, జాగ్రత్తలు పాటించాలని పోలీస్ శాఖ సూచిస్తోంది.
సైబర్ నేరగాళ్లు యువకుల మొదలు వృద్ధుల వరకు ఎవరినీ వదలడం లేదు. అవతలి వ్యక్తి బ్యాంకులో బ్యాలెన్స్ ఉందని తెలిస్తే చాలు.. వారికి వీడియోకాల్ ద్వారా ఫోన్చేసి ఆధార్కార్డు చూపించి మోసం చేస్తున్నారు.
సైబర్ నేరగాళ్లు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఇప్పటివరకు కేవలం యువకులే ఈ మోసాలకు పాల్పడగా తాజాగా... మహిళలు కూడా ఈ తరహ మోసాలకు పాల్పడడం విశేషం. నగరంలో ఓ వ్యక్తిని సైబర్ కి‘లేడీ’ మోసగించి రూ.24.44 లక్షలను దోచేసింది. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
సైబర్ నేరగాళ్లు మరో మోసానికి తెరలేపారు. ప్రముఖ సంస్థల పేర్లు వాడుకుంటూ.. ఆఫర్లు ఉన్నాయంటూ మోసాలకు పాల్పడుతున్నారు. నగరంలో ప్రతిరోజూ ఎవరో ఒకరు ఈ సైటర్ మోసగాళ్ల చేతిలో బలవుతూనే ఉన్నారు. లక్షలాది రూపాయలను పొగొట్టుకుంటూనే ఉన్నారు.
హైదరాబాద్ నగరం సైబర్ మోసాలకు అడ్డాగా మారిందనే విమర్శలొస్తున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో ఓ చోట ఈ మోసాలకు ఎవరో ఒకరు బలవుతూనే ఉన్నారు. తాజాగా ఓ మహిళ రూ.29.5 లక్షలను పోగొట్టుకుంది. ఇందకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
హైదరాబాద్కు చెందిన పలువురిని సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టించి లక్షలాది రూపాయలను కొట్టేసిన విషయం వెలుగులోకి వచ్చింది. మొత్తం రూ.8.24 లక్షలను కొల్లగొట్టారు. తమ ఖాతాల్లో ఉన్న నగదు మాయం కావడంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.