Home » Cyber attack
అధునాతన సాంకేతికత అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఆన్లైన్ మోసాలు పెచ్చుమీరిపోయాయి. సైబర్ నేరగాళ్లు రకరకాల మార్గాల ద్వారా జనాలను బురిడీ కొట్టిస్తూ.. లక్షల్లో డబ్బులు కాజేస్తున్నారు. ఓసారి ఆఫర్లతో..
నగరానికి చెందిన ఓ మహిళను బెదిరించిన సైబర్ క్రిమినల్స్(Cyber criminals) రూ. 2.90 లక్షలు కొల్లగొట్టారు. మోసపోయినట్లు గుర్తించిన బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దేశవ్యాప్తంగా రోజురోజుకి సైబర్ నేరాలు(Cyber Crimes) పెరిగిపోతున్నాయి. ఈ తరహా నేరాలపై ఎంతగా అవగాహన కల్పించాలని ప్రయత్నించినా.. మారుమూల గ్రామాల్లో చాలా మంది ఇప్పటికీ మోసపోతున్నారు. ఓటీపీ చెప్పడం, లింకులు క్లిక్ చేస్తూ రూ.లక్షలు పోగొట్టుకున్న ఎంతో మంది బాధితులు ఉన్నారు. ఈ నేపథ్యంలో దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) కీలక సూచనలు చేశారు.
డ్రగ్స్కేసులో కుమారుడు పట్టుబడ్డాడని తల్లిదండ్రులను బెదిరించిన సైబర్ నేరగాళ్లు(Cyber criminals) వారి నుంచి రూ.50వేలు దోపిడీ చేశారు. ఈ ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది.
కామారెడ్డి జిల్లా: పల్వంచ మండలం, భవానిపేట గ్రామానికి చెందిన వెంకట్ రెడ్డి అనే వ్యక్తి సైబర్ వలలో చిక్కుకున్నారు. వివరాల్లోకి వెళితే.. సైబర్ కేటుగాళ్లు వెంకట్ రెడ్డికి ఫోన్ చేశారు. అమెరికాలో ఉంటున్న మీ కుమార్తె మాధవి ఆపదలో ఉందని.. బెదిరింపు కాల్ చేశారు. ఆమె ఉంటున్న గదిలో మరో అమ్మాయి హత్యకు గురైందంటూ ఈ కేసు నుంచి మీ కూతురును తప్పించాలంటే రెండు లక్షలు ఖర్చవుతుందని, డబ్బులు పంపాలంటూ ఫోన్ చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కంబోడియా సైబర్ నేరగాళ్ల కేసులో కీలక నిందితుణ్ని సైబర్ సెక్యురిటీ పోలీసులు అరెస్టు చేశారు. చైనీయులతో చేతులు కలిపి భారతదేశానికి చెందిన నిరుద్యోగులను కంబోడియా పంపించడంలో కీలకంగా వ్యవహరిస్తు్న్న అబ్దుల్ అలాంను ఢిల్లీలో పట్టుకున్నారు.
వర్క్ ఫ్రం హోం(Work from home) పేరుతో సైబర్ నేరగాళ్ల(Cybercriminals) చేతిలో ఓ మహిళ మోసపోయిన ఘటన శుక్రవారం మేడ్చల్ జిల్లా కీసర పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం.. కీసర మండల కేంద్రంలో నివసించే లహరి గృహిణి. కుటుంబ సభ్యులతో కలిసి స్థానికంగా ఉన్న రాక్ ఫ్రంట్ కాలనీలో నివసిస్తుంది.
కస్టమ్స్ అధికారులమంటూ బెదిరించి ఓ మహిళ నుంచి రూ. 8.26 లక్షలు సైబర్ నేరగాళ్లు(Cyber criminals) కాజేశారు. నగరానికి చెందిన మహిళకు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి, కస్టమ్స్ అధికారిగా పరిచయం చేసుకున్నాడు.
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని లక్షల్లో డబ్బు కోల్పోయిన బాధితులకు ఊరట కల్పించే అంశమిది. బాధితులు డబ్బు కోల్పోయిన వెంటనే గోల్డెన్ అవర్(Golden hour)లో ఎన్సీఆర్పీ (నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్)లో, లేదా 1930 టోల్ఫ్రీ నంబర్కు ఫిర్యాదు చేస్తే ఆయా ఖాతాలను పోలీసులు స్తంభింపజేసే అవకాశం ఉంటుంది.
అరబ్ దేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నమ్మబలికి నిరుద్యోగులను బురిడీ కొట్టించి రూ.లక్షల్లో కొల్లగొడుతున్న ఢిల్లీకి చెందిన సైబర్ క్రిమినల్(Cyber criminal)ను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.