Share News

Simhachalam Incident: సింహాచలం ఘటన.. ప్రభుత్వం చేతిలో కీలక నివేదిక

ABN , Publish Date - May 05 , 2025 | 08:40 PM

Simhachalam Incident: సింహాచలంలో శ్రీవరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి చందనోత్సవం ఏప్రిల్ 30వ తేదీన జరిగింది. ఆ రోజు తెల్లవారుజామున టికెట్ల కోసం క్యూ లైన్‌లో ఉన్న భక్తులపై గోడ కూలింది. ఈ దుర్ఘటనలో 8 మంది మరణించారు. ఈ ఘటనపై ప్రభుత్వం కమిషన్ నియమించింది. ఆ కమిషన్.. ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అందులో పలు కీలక విషయాలను వెల్లడించింది.

Simhachalam Incident: సింహాచలం ఘటన.. ప్రభుత్వం చేతిలో కీలక నివేదిక

అమరావతి, మే 05: సింహాచలంలో చందనోత్సవం సందర్భంగా క్యూ లైన్‌లో నిలుచున్న భక్తులపై గోడ కూలిన ఘటనకు సంబంధించి త్రిసభ్య కమిషన్.. తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. సోమవారం అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడుకి కమిషన్ చైర్మన్, పురపాలక శాఖ కార్యదర్శి సురేశ్ కుమార్ ఈ నివేదికను అందజేశారు. తాత్కాలికంగా నిర్మించిన గోడకు పునాది కూడా లేదని ఈ ప్రాథమిక నివేదికలో త్రిసభ్య కమిషన్ స్పష్టం చేసింది. భారీ వర్షం కారణంగా పెద్ద ఎత్తున నీరు.. బురద చేరడంతో బరువు కారణంగా ఆ గోడ కూలినట్టు కమిషన్ అభిప్రాయపడింది. గోడ దిగువకు నీరు వెళ్లేందుకు లీప్ హోల్స్ కూడా లేవని ప్రాథమిక నివేదికలో పేర్కొంది.


చందనోత్సవానికి వారం రోజుల ముందు ఈ గోడను హడావిడిగా నిర్మించినట్లు స్పష్టం చేసింది. అంతేకాకుండా.. ప్రసాద్ స్కీమ్‌లో భాగంగా ఈ గోడ నిర్మాణానికి హడావిడిగా అనుమతులిచ్చారని తెలిపింది. అలాగే గోడ నిర్మాణానికి ఎలాంటి డిజైన్లు కానీ.. పునాదులు కానీ లేకుండా నిర్మించారని తన ప్రాథమిక నివేదికలో కమిషన్ వెల్లడించింది. గోడ పటిష్టత గురించి, భక్తుల భద్రత గురించి ఎలాంటి తనిఖీలు చేయలేదని చెప్పింది.


విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్‌తో సహా పలువురు ప్రత్యక్ష సాక్షుల నుంచి దీనిపై స్టేట్‌మెంట్లు తీసుకుని వాటిని సైతం త్రిసభ్య కమిషన్ నమోదు చేసింది. ఈ దుర్ఘటనకు ఆలయ ఈఓ, ఇంజనీరింగ్ సిబ్బంది, టూరిజం కార్పోరేషన్ అధికారులు, కాంట్రాక్టర్ లక్ష్మణ్ రావు బాధ్యులని కమిషన్ తన నివేదికలో పేర్కొంది. వీరందరిపై తీవ్ర చర్యలకు త్రిసభ్య కమిషన్ సిఫార్సు చేసింది. ఏప్రిల్ 21వ తేదీన నిర్మించిన గోడకు వీపింగ్ హోల్స్ లేక పోవడం ప్రమాదానికి ప్రధాన కారణమని ఈ కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది.


కనీసం పునాది లేకుండా, కాంక్రీట్ వేయకుండా గోడను నిర్మించినట్టు నివేదికలో వెల్లడించింది. ఫ్లై యాష్ వినియోగించి ఈ స్థాయిలో 20 మీటర్ల గోడను నిర్మించినట్టు తెలిపింది. గోడ నిర్మాణం తరవాత సరిగా క్యూరింగ్ కూడా జరగలేదని తమ విచారణలో వెల్లడైనట్లు చెప్పింది. నిర్మితమైన గోడను దేవాదాయ, టూరిజం కార్పొరేషన్ ఇంజినీర్లు సర్టిఫై కూడా చేయలేదని తన నివేదికలో కమిషన్ పేర్కొంది. మెట్ల రూట్ మార్చడంలో నిర్దిష్టమైన అనుమతులు సైతం లేవని ఆ నివేదికలో కమిషన్ వెల్లడించింది.


ఏప్రిల్ 30 తేదీన సింహాచలంలో కొలువు తీరిన శ్రీవరాహా స్వామి వారికి చందనోత్సవం నిర్వహించారు. ఆ రోజు స్వామి వారి నిజరూప దర్శనం కోసం ఆ ముందు రోజు అర్థరాత్రి నుంచి భక్తులు టికెట్ల కోసం క్యూ లైన్‌లో నిలుచున్నారు. ఆ క్రమంలో క్యూలైన్‌లో ఉన్న భక్తులపై గోడ కూలింది. ఈ ఘటనలో ఏడుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇక ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలంటూ సీనియర్ ఐఏఎస్ అధికారి సురేశ్ కుమార్ సారథ్యంలో త్రిసభ్య కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఘటనలో మృతి చెందినవారితోపాటు గాయపడిన వారికి ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి..

Simhachalam Incident: సింహాచలం ఘటన.. ప్రభుత్వం చేతిలో కీలక నివేదిక Earthquake: భూ ప్రకంపనలు.. పరుగులు తీసిన ప్రజలు

Vidadala Rajini: విడదల గోపి బెయిల్ పిటిషన్ డిస్మిస్.. జైలుకు తరలింపు

Pahalgam Terror Attack: పాక్‌కు వ్యతిరేకంగా భారత్ మరో కీలక నిర్ణయం

TGSRTC Workers Strike: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..

WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు

TGSRTC: బస్ భవన్‌‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం

For Andhrapradesh News And Telugu News

Updated Date - May 05 , 2025 | 09:28 PM