Vidadala Rajini: విడదల గోపి బెయిల్ పిటిషన్ డిస్మిస్.. జైలుకు తరలింపు
ABN , Publish Date - May 05 , 2025 | 07:05 PM
Vidadala Rajini: గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ఆమె వసూళ్లకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి.

విజయవాడ, మే 05: బలవంతపు వసూళ్లకు పాల్పడిన కేసులో అరెస్టయిన మాజీ మంత్రి విడదల రజనీ మరిది విడదల గోపి బెయిల్ పిటిషన్ను ఏసీబీ కోర్టు సోమవారం డిస్మిస్ చేసింది. పల్నాడు జిల్లాలో స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి బలవంతంగా నగదు వసూల్లకు పాల్పడిన కేసులో విడదల గోపిని ఏసీబీ అధికారులు ఇటీవల అరెస్ట్ చేశారు. దీంతో విజయవాడ సబ్ జైలులో విడదల గోపి ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా పని చేశారు. ఆ సమయంలో ఆమె వసూళ్లకు పాల్పడినట్లు తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. కానీ నాటి వైసీపీ ప్రభుత్వం ఆమెపై ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అయితే 2024లో అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలోని పార్టీలకు ప్రజలు పట్టం కట్టారు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది.
అనంతరం గత ప్రభుత్వ హాయాంలో చోటు చేసుకున్న అవినీతి అక్రమాలపై కూటమి సర్కారు దృష్టి సారించింది. అదీకాక..వైసీపీ ప్రభుత్వం కారణంగా బాధితులుగా మారిన వారంతా ఒక్కొక్కరుగా బయటకు వచ్చి ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో స్టోన్ క్రషర్ యాజమాన్యం సైతం బయటకు వచ్చి.. మాజీ మంత్రి విడదల రజనీతోపాటు ఆమె మరిది గోపి, ఆమె పీఏ రామకృష్ణ తదితరులపై ఫిర్యాదు చేశారు. దీంతో ఏసీబీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అందులోభాగంగా విడదల రజనీ మరిదిని ఏసీబీ అరెస్ట్ చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
Pahalgam Terror Attack: పాక్కు వ్యతిరేకంగా భారత్ మరో కీలక నిర్ణయం
TGSRTC Workers Strike: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..
WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
TGSRTC: బస్ భవన్ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం
For AndhraPradesh News And Telugu News