Special Trains: గుంతకల్లు మీదుగా రెండు ప్రత్యేక రైళ్లు.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..
ABN , Publish Date - Aug 06 , 2025 | 01:22 PM
ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి గుంతకల్లు రైల్వే డివిజన్ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. బెంగళూరు-బీదర్ (06519) ప్రత్యేకరైలు ఈ నెల 14న బెంగళూరులో రాత్రి 9-15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం పదకొండున్నరకు బీదర్కు చేరుకుంటుందన్నారు.
గుంతకల్లు: ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి గుంతకల్లు రైల్వే డివిజన్(Guntakal Railway Division) మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు మంగళవారం ప్రకటనలో తెలిపారు. బెంగళూరు-బీదర్ (06519) ప్రత్యేకరైలు ఈ నెల 14న బెంగళూరులో రాత్రి 9-15 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం పదకొండున్నరకు బీదర్కు చేరుకుంటుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (06520) ఈ నెల 15న బీదర్లో మధ్యాహ్నం రెండున్నరకు బయల్దేరి మరుసటిరోజు ఉదయం నాలుగున్నరకు బెంగళూరుకు చేరుతుందన్నారు. ఈ రైలు యల్హంక, హిందూపురం, ధర్మవరం,
అనంతపురం(Hindupur,Dharmavaram, Anantapur) గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూరు, క్రిష్ణా, యాద్గిర్, షాహాబాద్, కలబురగి, హోమ్నాబాద్ స్టేషన్ల మీదుగా బీదర్కు వెళ్తుందన్నారు. అలాగే కోయంబత్తూరు-జైపూర్ ప్రత్యేక వీక్లీ రైలు ఈనెల 7 నుంచి సెప్టెంబరు 4 వరకూ గురువారాలలో కోయంబత్తూరులో ఉదయం రెండున్నరకు బయల్దేరి రెండో రోజు (శని వారాలలో) మధ్యాహ్నం 1-25 గంటలకు జైపూర్కు చేరుతుందన్నారు. దీని తిరుగు ప్రయాణపు రైలు (06182) ఈనెల 10 నుంచి సెప్టెంబరు ఏడు వరకూ ఆదివారాలలో రాత్రి 10-05 గంటలకు జైపూర్లో బయల్దేరి మూడో రోజు (బుధవారాలలో) ఉదయం ఎనిమిదిన్నరకు కోయంబత్తూరుకు చేరుకుంటుందన్నారు.

ఈ రైలు తిరుప్పూర్, ఈరోడ్, సేలం, జోలార్పట్టై, కాట్పాడి, రేణిగుంట, కడప, యర్రగుంట్ల, గుత్తి, డోన్, కర్నూలు సిటీ, గద్వాల, మహబూబ్నగర్, కాచిగూడ(Kachiguda), కామారెడ్డి, నిజామాబాద్, ముడ్ఖేడ్, నాందేడ్, పూర్ణా, హింగోలి, వాసిం, అకోలా, భూస్వాల్, జల్గావ్, నందుర్బర్, ఉడ్నా, భరుచ్, బడోదర, గోద్రా, రత్లం, జవోరా, మండ్సర్, నిమచ్, చిత్తౌర్ఘర్, చండేరియా, భిల్వారా, బిజయ్నగర్, నాసిరాబాద్, అజ్మీర్, కిష్ణఘర్ స్టేషన్ల మీదుగా జైపూర్కు చేరుకుంటుందన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆది నుంచీ అక్రమాల ‘సృష్టి’ డాక్టర్ నమ్రత చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
Read Latest Telangana News and National News