Share News

Pawan Kalyna: ఆవిర్భావ దినోత్సవ వేళ.. పలువురు నేతలకు కీలక బాధ్యతలు

ABN , Publish Date - Feb 24 , 2025 | 10:04 PM

Pawan Kalyna: జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరికొద్ది రోజుల్లో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

Pawan Kalyna: ఆవిర్భావ దినోత్సవ వేళ.. పలువురు నేతలకు కీలక బాధ్యతలు

అమరావతి, ఫిబ్రవరి 24: గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ బరిలో నిలిపిన 21 మంది అభ్యర్థులు ఘన విజయం సాధించారు. చంద్రబాబు సారథ్యంలో కొలువు తీరిన ప్రభుత్వంలో ఆ పార్టీ కీలక భాగస్వామి అయింది. అలాంటి వేళ.. మార్చి 14వ తేదీన పిఠాపురంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించాని స్థానిక ఎమ్మెల్యే, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నిర్ణయించారు.

అందులోభాగంగా ఈ వేడుకలకు పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నియమించారు. అందుకోసం.. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను ఆయన నియామించారు. పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల ఇంచార్జులు, పీ.ఓ.సీలు, మండలాధ్యక్షులతో సమావేశాలు నిర్వహించి.. పార్టీ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేసేలా కీలక బాధ్యతలు అప్పగించారు.


పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలు

  • శ్రీకాకుళం: కొరికన రవి కుమార్

  • విజయనగరం: లోకం నాగ మాధవి

  • విశాఖపట్నం: సిహెచ్.వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్

  • అనకాపల్లి: పంచకర్ల రమేశ్ బాబు

  • అరకు: వంపూరు గంగులయ్య

  • కాకినాడ: తుమ్మల రామస్వామి

  • రాజమండ్రి: యర్నాగుల శ్రీనివాసరావు

  • అమలాపురం: బండారు శ్రీనివాసరావు

  • నరసాపురం: కొటికలపూడి గోవిందరావు

  • ఏలూరు: రెడ్డి అప్పల్నాయుడు

  • మచిలీపట్నం: బండి రామకృష్ణ

  • విజయవాడ: సామినేని ఉదయభాను

  • గుంటూరు: గాదె వెంకటేశ్వర రావు


Updated Date - Feb 24 , 2025 | 10:04 PM