Pawan Kalyan: గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలి
ABN , Publish Date - Dec 06 , 2025 | 02:24 PM
అడవిని నమ్ముకొని బతికే గిరిజనుల జీవన ప్రమాణాలు పెరిగేలా యంత్రాంగం పనిచేయాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. గిరిజనుల ఆదాయ మార్గాలు పెంచాలని.. దానికి తగినట్లుగా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని దిశానిర్దేశం చేశారు.
అమరావతి, డిసెంబరు6 (ఆంధ్రజ్యోతి): గిరిజనులకు జీవనోపాధి మార్గాలు పెంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ (Pawan Kalyan) సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అధికారులతో ఇవాళ(శనివారం) ఏపీ సచివాలయంలో టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు పవన్ కల్యాణ్.
గిరిజనులకు జీవనోపాధి మార్గాలపై పకడ్బందీ ప్రణాళికను అమలు చేయాలని మార్గనిర్దేశం చేశారు. గిరిజన ఉత్పత్తుల పెంపు, మార్కెటింగ్ అవసరమని చెప్పుకొచ్చారు. ఎకో టూరిజం మీద అవగాహన కల్పిస్తే ఆదాయ వృద్ధి చెందుతుందని సూచించారు. యువతలో నిరుద్యోగం లేకుండా చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలో సినిమాలు, సీరియళ్ల షూటింగ్ జరిగేలా ప్రోత్సహించాలని సూచించారు పవన్ కల్యాణ్.
ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉద్యాన పంటలకు అనుసంధానం ద్వారా మంచి ఫలితాలు రాబట్టాలని మార్గనిర్దేశం చేశారు. అడవిని నమ్ముకొని బతికే గిరిజనుల జీవన ప్రమాణాలు పెరిగేలా యంత్రాంగం పనిచేయాలని ఆదేశించారు. గిరిజనుల ఆదాయ మార్గాలు పెంచాలని.. దానికి తగినట్లుగా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలను రూపొందించాలని పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భక్తులకు అలర్ట్.. టీటీడీ మరో కీలక నిర్ణయం
వారు మాతోనే ఉన్నారు.. మావోయిస్టుల సంచలన ప్రకటన
Read Latest AP News and National News