MLA Pullarao: ఆ యాక్ట్ అమలైతే ఏపీ పరిస్థితి ఘోరంగా ఉండేది
ABN , Publish Date - May 08 , 2025 | 03:13 PM
MLA Prathipati Pullarao: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో ఏపీకి తీరని నష్టం చేశారని విమర్శించారు.

పల్నాడు జిల్లా: మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు (MLA Prathipati Pullarao) సంచలన వ్యాఖ్యలు చేశారు. గత పాలకుల తప్పిదాలు సరిచేస్తూనే, ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తోందని అన్నారు. సీఎం చంద్రబాబు ప్రతి ఆలోచనా.. కష్టం తమకోసమేననే నిజాన్ని ప్రజలు గ్రహించాలని అన్నారు. అమరావతి, పోలవరం పూర్తిచేసి, రాష్ట్రాన్ని దేశంలోనే ఉన్నతస్థానంతో నిలపాలన్నదే చంద్రబాబు జీవితాశయమని చెప్పారు. చిలకలూరిపేటలో ప్రభుత్వం సబ్సిడీపై ఇచ్చే పశుగ్రాసం, దాణా పంపిణీని ఇవాళ (గురువారం) ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు.
జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ల్యాండ్ టైటిల్ యాక్ట్ అమలైతే పరిస్థితి దారుణంగా ఉండేదని అన్నారు. ప్రజలు తమ ఆస్తులు, భూములు కోల్పోయి కట్టుబట్టలతో మిగిలేవారని చెప్పారు. జగన్ హయాంలో ఏపీకి తీరని నష్టం జరిగిందని ఆరోపించారు. రాత్రికి రాత్రే అద్భుతాలు జరగడం లేదనుకోకుండా, స్వేచ్ఛా, సంతోషంతో జీవిస్తున్నామని ప్రజలు తెలుసుకోవాలని చెప్పారు. ప్రతి హామీ అమలుతో పాటు, రాష్ట్ర పునర్నిర్మాణమే కూటమి ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
Gottipati Ravikumar: అందుకే యాక్సిస్ బ్రూక్ ఫీల్డ్తో ఒప్పందం.. తేల్చిసిన మంత్రి
AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ నేడు.. కీలక అంశాలపై చర్చ
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. వైరల్గా మాజీ ఆర్మీ చీఫ్ పోస్ట్
Donald Trump: ఆపరేషన్ సిందూర్పై డొనాల్డ్ ట్రంప్ స్పందన
Read latest AP News And Telugu News