Heavy Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు
ABN , Publish Date - May 25 , 2025 | 06:39 PM
Heavy Rains In AP: ఈసారి నైరుతి రుతుపవనాలు త్వరగా ఏపీలోకి ప్రవేశిస్తుండటంతో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఎండలతో పాటు వేడిగాడ్పులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమయంలో వాతావరణ శాఖ పండుగలాంటి వార్త తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో ఏపీలో 3 రోజుల పాటు భారీ వర్షాలు (Heavy Rains) కురవనున్నాయి. తీరం వెంట గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. అయితే ఏపీలో నైరుతి రుతుపవనాలు సోమవారం ప్రవేశించనున్నాయి. మరో 24 గంటల్లో రాయలసీమను రుతుపవనాలు చేరుకోనున్నాయి.
ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారంలో ఏపీలోకి ప్రవేశించే రుతుపవనాలు ఈ సారి త్వరగా రాష్ట్రానికి రానున్నాయి. సాధారణంగా రుతుపవనాలు జూన్ 1వ తేదీ నాటికి కేరళ తీరాన్ని చేరుకుంటాయి. కానీ ఈ సారి మే 24నే రుతుపవనాలు ప్రారంభమయ్యాయి. ఈ రుతుపవనాలు కేరళ, తమిళనాడు, కర్ణాటక, మిజోరాం, తదితర రాష్ట్రాలను తాకి ఆంధ్రప్రదేశ్ వైపు కదలనున్నాయి. రుతుపవనాల రాకతో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నం కానున్నారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
సీఎం చంద్రబాబు కుటుంబం నూతన గృహప్రవేశం
పండుగలా సీఎం చంద్రబాబు గృహప్రవేశం
For More AP News and Telugu News