Government Rewards FOR Athletes: ఏపీ క్రీడాకారులకు బంపరాఫర్.. ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన
ABN , Publish Date - Aug 29 , 2025 | 10:13 AM
జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా ఏపీ క్రీడాకారులకు రాష్ట్ర ప్రభుత్వం మరో బంపరాఫర్ ప్రకటించింది. రూ.1.98 కోట్ల క్రీడా ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
అమరావతి, ఆగస్టు29(ఆంధ్రజ్యోతి): జాతీయ క్రీడాదినోత్సవం సందర్భంగా ఏపీ క్రీడాకారులకు (Athletes) రాష్ట్ర ప్రభుత్వం (AP Government) మరో బంపరాఫర్ ప్రకటించింది. తాజాగా రూ.1.98 కోట్ల క్రీడా ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.
క్రీడాకారులకు ప్రోత్సహం: రవినాయుడు

ఈ మేరకు శాప్ చైర్మన్ రవినాయుడు (SAP Chairman Ravinaidu) కీలక ప్రకటన విడుదల చేశారు. ఏపీలో 177 మంది జాతీయ క్రీడాకారులకు ప్రోత్సాహకాలు విడుదల చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించడంతోపాటు వారిని గౌరవించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఉద్ఘాటించారు. ఏపీ వ్యాప్తంగా క్రీడాకారులందరూ సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. క్రీడాప్రోత్సాహకాలు విడుదల చేసినందుకు సీఎం చంద్రబాబునాయుడుకి క్రీడాకారుల తరుపున రవినాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వైఎస్ జగన్ చట్టం ముందు దోషిగా నిలబడక తప్పదు..
ఏపీ ప్రభుత్వ స్టీల్ను దోచిన ఘనులు.. భారీ స్కాం వెలుగులోకి...
For More AndhraPradesh News And Telugu News