Share News

Road Accidents: తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు.. నలుగురు మృతి

ABN , Publish Date - May 10 , 2025 | 09:27 AM

Road Accidents in Telugu states: తెలుగు రాష్ట్రాల్లో శనివారం నాడు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు చనిపోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Road Accidents: తెలుగు రాష్ట్రాల్లో ఘోర ప్రమాదాలు.. నలుగురు మృతి
Road Accidents in Telugu states

బాపట్ల : రోడ్డు ప్రమాదాలపై ఎంతగా అవగాహన కల్పిస్తున్న ఏదోక ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. గమ్యస్థానాలకు త్వరగా చేరాలనే సమయంలో అత్యంత వేగంగా వాహనాలు నడుపుతున్నారు. అతివేగంతో ఎంతో విలువైన జీవితాలను కోల్పోతున్నారు. ఈ ప్రమాదాల్లో కుటుంబ సభ్యులు మృతిచెందుతుండటంతో ఆయా కుటుంబాలు తీవ్ర శోక సంద్రంలో మునిగిపోతున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ(శనివారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి.


బాపట్ల జిల్లాలోని పర్చూరు మండలం తిమ్మరాజుపాలెం వద్ద గ్రానైట్ లారీ బోల్తా పడింది. లారీలో ప్రయాణిస్తున్న ముగ్గురు కూలీలు మృతిచెందారు. మృతులు పాలపర్తి శ్రీను(25), తాళ్లూరి ప్రభుదాస్(37), తమ్ములూరి సురేంద్ర (26 )గా గుర్తించారు. మార్టూరు నుంచి గుంటూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


పెద్దఅంబర్‌పేట్‌లో వ్యక్తి సజీవదహనం

హైదరాబాద్: పెద్దఅంబర్ పేట్ ఔటర్ రింగురోడ్డు వద్ద ఇవాళ(శనివారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న బొలెరో వాహనాన్ని టాటా కారు ఢీ కొట్టింది. ప్రమాదం సంభవించడంతో మంటల్లో పూర్తిగా రెండు వాహనాలు దగ్ధమయ్యాయి. కారులో ఉన్న వ్యక్తి సజీవ దహనమయ్యాడు. మరొకరిని స్థానికులు కాపాడారు. పెద్దఅంబర్‌పేట్ నుంచి ఘట్‌కేసర్ వెళ్తుండగా ఔటర్ రింగురోడ్డు సర్వీస్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Lavu Sri Krishna Devarayalu: తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి

Pawan Kalyan: సైనికులకు నైతిక మద్దతిద్దాం

Airport Security Alert: ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్‌

Minister Sandhya Rani: అన్ని గిరిజన గ్రామాల్లో అభివృద్ధి

For More AP News and Telugu News

Updated Date - May 10 , 2025 | 09:35 AM