Share News

Harassment case: వివాహితకు వేధింపులు.. ఆర్ఎస్ఐ‌పై కేసు నమోదు

ABN , Publish Date - May 10 , 2025 | 07:56 AM

Harassment case: ఓ వివాహితను మూడేళ్లుగా వేధిస్తున్న రెడ్ శాండల్ టాస్క్‌ఫోర్స్ ఆర్‌ఎస్‌ఐ‌ విశ్వనాథ్‌పై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విశ్వనాథ్‌పై గృహ హింస, బెదిరింపులు, అసభ్యకరంగా ప్రవర్తించడం, తదితర కారణాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Harassment case: వివాహితకు వేధింపులు.. ఆర్ఎస్ఐ‌పై కేసు నమోదు
Harassment case

తిరుపతి: మహిళను వేధిస్తుండటంతో రెడ్ శాండల్ టాస్క్‌ఫోర్స్ ఆర్ఎస్ఐ విశ్వనాథ్‌పై అలిపిరి పోలీసులు ఇవాళ(శనివారం) కేసు నమోదు చేశారు. మూడేళ్లుగా వేధింపులకు గురిచేస్తూ... కాపురంలో గొడవలు పెడుతున్న విశ్వనాథ్‌పై చర్యలు తీసుకోవాలని వివాహిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. విశ్వనాథ్‌ చెప్పినట్లుగా వినకపోతే తన భర్తను చంపేస్తానని ఫోన్‌లో బెదిరింపులకు దిగాడని బాధితురాలు పేర్కొంది. జనవరిలో స్నేహితులతో కలసి తన భర్తపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో ఆమె ప్రస్తావించింది. వేధింపులతో పాటు ఆర్ఎస్ఐపై అవినీతి ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆయనపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు.


స్మగ్లర్ విజయానందరెడ్డి అండదండలతో టాస్క్‌ఫోర్స్‌లో విశ్వనాథ్‌ పొస్టు దక్కించుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. 2022లో తనను ఆర్ఎస్ఐ విశ్వనాథ్ వేధిస్తున్నారని అలిపిరి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. మూడేళ్లుగా తన కుటుంబాన్ని ఆర్ఎస్ఐ వేధిస్తున్నారని బాధితురాలు తెలిపింది. తన మొబైల్‌కు అసభ్యకరమైన వీడియోలను ఆర్ఎస్ఐ విశ్వనాథ్‌ పంపించారని ఫిర్యాదులో పేర్కొంది. తట్టుకోలేని బాధితురాలి భర్త ఆర్ఎస్ఐ విశ్వనాథ్‌కి దేహశుద్ది చేశాడు. వివాహిత ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. బాధితురాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Lavu Sri Krishna Devarayalu: తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక రైళ్లు నడపండి

Pawan Kalyan: సైనికులకు నైతిక మద్దతిద్దాం

Airport Security Alert: ఎయిర్‌పోర్టుల్లో హైఅలర్ట్‌

Minister Sandhya Rani: అన్ని గిరిజన గ్రామాల్లో అభివృద్ధి

For More AP News and Telugu News

Updated Date - May 10 , 2025 | 08:33 AM