Share News

Medaram: కంపుకొడుతున్న మేడారం పరిసరాలు.. పట్టించుకోని అధికారులు

ABN , Publish Date - Mar 05 , 2024 | 10:28 AM

Telangana: తెలంగాణ కుంభమేళాగా పిలవడే మేడారం సమక్క-సారలమ్మ మహా జాతర అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది మంది భక్తులు మేడారంకు విచ్చేసి గద్దెలపై కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకుని... మొక్కలు చెల్లించుకున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరిగింది. అయితే జాతర ముగిసిన తర్వాత మాత్రం అక్కడి పరిసరాలను చూస్తే ముక్కులు మూసుకోకమానరు.

Medaram: కంపుకొడుతున్న మేడారం పరిసరాలు.. పట్టించుకోని అధికారులు

ములుగు, మార్చి 5: తెలంగాణ కుంభమేళాగా పిలవడే మేడారం సమక్క-సారలమ్మ మహా జాతర (Medram Mahajatara 2024) అంగరంగ వైభవంగా జరిగింది. లక్షలాది మంది భక్తులు మేడారంకు విచ్చేసి గద్దెలపై కొలువుదీరిన అమ్మవార్లను దర్శించుకుని... మొక్కలు చెల్లించుకున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు మేడారం జాతర జరిగింది. అయితే జాతర ముగిసిన తర్వాత మాత్రం అక్కడి పరిసరాలను చూస్తే ముక్కులు మూసుకోకమానరు. జాతర అనంతరం పరిశుభ్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. ఫలితంగా మేడారంలోని పరిసర ప్రాంతాలు కంపుకొడుతున్నాయి. అధికారులు, క్లీనింగ్ సిబ్బంది పత్తాలేకుండా పోవడంతో ఎక్కడికక్కడ చెత్తా చెదారం నిండిపోయి కనబడుతోంది. ఈగలు, దోమలు ముసురుకున్న పరిస్థితి. మరుగుదొడ్లు, జంతు వ్యర్థాలను తీయకపోడంతో ఆ ప్రాంతంలో దుర్గంధం వ్యాప్తి చెందుతోంది. దీంతో అక్కడి స్థానికులు మేడారంలో ఉండలేక వేరే ఊర్లకు వెళుతున్నారు. శుభ్రం చేయాల్సిన సమయంలో అధికారులు అందుబాటులో లేకపోవడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి...

PM Modi: నేడు సంగారెడ్డి జిల్లాలో ప్రధాని మోదీ పర్యటన

AP Politics: జగన్‌ను వాలంటీర్లు కూడా వ్యతిరేకిస్తున్నారా?.. నెల్లూరులో ఏం జరుగుతోంది?


మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 05 , 2024 | 10:36 AM