Share News

Road Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

ABN , Publish Date - Apr 25 , 2024 | 06:57 AM

సూర్యాపేట జిల్లా: కోదాడ శివారు దుర్గాపురం వద్ద హైదరాబాద్- విజయవాడ 65వ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది.

Road Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

సూర్యాపేట జిల్లా: కోదాడ శివారు దుర్గాపురం వద్ద హైదరాబాద్ (Hyderabad)- విజయవాడ (Vijayawada) 65వ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది. ఆగి ఉన్న లారీ (Lorry)ని వెనుక నుంచి కారు (Car) ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన ప్రదేశానికి చేరుకుని సమీక్షించారు.


అతి వేగం, నిద్రలేమి ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


కాగా ఈ ప్రమాదంలో మృతులంతా ఖమ్మం జిల్లా, బోనకల్ మండలం, గోవిందాపురం వాసులుగా గుర్తించారు. గుణదలలో మనవరాలుకు చెవులు కుట్టించేందుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో చెవులు కుట్టించుకునే పాప సహా తల్లి దండ్రులు, తాతయ్య, నానమ్మ, మామ మృతి చెందారు. లారీ బ్రేక్ డౌన్ కావడంతో వెనుక నుంచి కారు ఢీ కొట్టింది.

మృతులు....

భార్య భర్తలు

నల్లమల చందర్ రావు(52), మాణిక్యమ్మ (45).

కొడుకు, కోడలు, మనుమరాలు

కృష్ణరాజు(28), స్వర్ణ (25), లావణ్య (4)

అల్లుడు జె. శ్రీకాంత్(26), కోదాడ మండలం చిమిర్యాల.


ఈ వార్తలు కూడా చదవండి..

మంత్రి రోజాకు చేదు అనుభవం..

జగన్ ప్రభుత్వంపై కేంద్రం అసహనం..

జగన్‌కు ఈసీ మరో షాక్

జగన్‌ అరెస్టు ఖాయం

దళితులపై దౌష్టికం!

మండుతున్న రాష్ట్రం

సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం, ఆరుగురు మృతి

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News and Crime News

Updated Date - Apr 25 , 2024 | 11:38 AM