Share News

Lok Sabha Polls: ఆసక్తికర పరిణామం.. బిష్ణుపూర్‌లో మాజీ భార్య- భర్తల పోటీ

ABN , Publish Date - Mar 11 , 2024 | 01:40 PM

లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రధాన పార్టీలు ప్రకటిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బిష్ణుపూర్ లోక్ సభ నియోజకవర్గంలో మాజీ భార్య- భర్తలు బరిలోకి దిగుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుజతా మోండల్ బరిలోకి దిగారు. భారతీయ జనతా పార్టీ నుంచి సౌమిత్రా ఖాన్ పోటీ చేస్తున్నారు. బిష్ణుపూర్‌లో మాజీ భార్య- భర్తలు బరిలోకి దిగడంతో ప్రచారం మరింత హీటెక్కించనుందనే స్థానికులు అంటున్నారు.

Lok Sabha Polls: ఆసక్తికర పరిణామం.. బిష్ణుపూర్‌లో మాజీ భార్య- భర్తల పోటీ

కోల్‌కతా: లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రధాన పార్టీలు ప్రకటిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో (West Bengal) ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బిష్ణుపూర్ (Bishnupur) లోక్ సభ నియోజకవర్గంలో మాజీ భార్య- భర్తలు బరిలోకి దిగుతున్నారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (TMC) నుంచి సుజతా మోండల్ (Sujata Mondal) బరిలోకి దిగారు. భారతీయ జనతా పార్టీ నుంచి సౌమిత్రా ఖాన్ (Saumitra Khan) పోటీ చేస్తున్నారు. బిష్ణుపూర్‌లో మాజీ భార్య- భర్తలు బరిలోకి దిగడంతో ప్రచారం మరింత హీటెక్కించనుందనే స్థానికులు అంటున్నారు.

ఏం జరిగిందంటే..?

సౌమిత్ర ఖాన్ సుజాతను 2010లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి అయ్యే సమయంలో సుజాత ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పని చేశారు. పెళ్లి సమయంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న సౌమిత్ర ఖాన్ 2019 లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఆ సమయంలో సౌమిత్ర ఖాన్ కోసం సుజాత ప్రచారం చేశారు. 2021లో సుజాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సుజాత టీఎంసీలో చేరడాన్ని సౌమిత్ర ఖాన్ జీర్ణించుకోలేక పోయారు. మీడియా ముందే సుజాతతో వీడిపోతున్నానని ప్రకటించారు.

మాజీ భర్తపై పోటీ

2019 నుంచి సౌమిత్ర ఖాన్ బీజేపీలో ఉన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బిష్ణుపూర్ నుంచి బరిలోకి దిగుతున్నారు. ప్రస్తుతం సౌమిత్ర శాసన సభ్యురాలిగా ఉన్నారు. ఇటీవల 42 స్థానాలకు టీఎంసీ అభ్యర్థులను ప్రకటించింది. అందులో సుమిత్ర పేరు కూడా ఉంది. మాజీ భర్త పోటీ చేసే స్థానంలో సుమిత్ర పేరును టీఎంసీ అనౌన్స్ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 11 , 2024 | 01:40 PM