Home » TMC
గురువారం న్యూఢిల్లీలో జరిగిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మీటింగ్కు మహువా మొయిత్రా ఢిల్లీ బయలుదేరారు. ఇండిగో విమానంలో ఆమె ఢిల్లీకి వెళుతుండగా.. కొంతమంది ప్రయాణికులు ఆమెతో తప్పుగా ప్రవర్తించారు. టీఎంసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ నాయకుడు సువేందు అధికారి వ్యక్తిగత సహాయకుడిని గుర్తుతెలియని దుండగలు కాల్చి చంపేశారు. ఈ ఘటన ఉత్తర 24 పరగణాల జిల్లాలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పశ్చిమబెంగాల్లో ఉద్రిక్తతలు మొదలయ్యాయి. కోల్కతాలోని ప్రసిద్ధ న్యూ మార్కెట్ ప్రాంతంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయాన్ని బుల్డోజర్తో కూల్చివేయడం తీవ్ర కలకలం రేపింది.
బెంగాల్లో అఖండ విజయం అనంతరం సీఎం రేసులో ముందు వరుసలో ఉన్న సువేందు అధికారి స్పందించారు. ఆప్లాగే టీఎంసీ అవినీతిమయమైందని, ఆ పార్టీ పతనం ఖరారైందని ఆయన విమర్శించారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార తృణముల్ కాంగ్రెస్ (TMC) అనూహ్యంగా ఓటమి పాలవడంతో, మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు ప్రజా తీర్పు కాదని, ఇది పూర్తిగా 'లూటీ' అని ఆమె ఆరోపించారు.
బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని TMC పతనానికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 'RG Kar అత్యాచారం-హత్య' కేసు విషయంలో వ్యవహరించిన తీరు, పనితీరులో వైఫల్యం, గూండాయిజం, ముఖ్యంగా GenZ, GenX తరం తీవ్ర అసంతృప్తితో రగిలిపోవడం కీలకమైంది.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల కౌటింగ్ విషయంలో ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ తృణమూల్ కాంగ్రెస్ సుప్రీంకోర్టును శుక్రవారంనాడు ఆశ్రయించింది.
బెంగాల్లో చాణక్య స్ట్రాటజీస్, మ్యాట్రిజ్, ప్రజాపోల్, పోల్ డైరీ వంటి ఎగ్జిట్పోల్స్ బీజేపీకి పట్టం కట్టాయి. పీపుల్స్ పల్స్, జన్మత్ పోల్స్ టీఎంసీ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పాయి.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు టీఎంసీ ఎంపీలు గైర్హాజరవ్వడాన్ని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తప్పుబట్టారు. ఎంపీలంతా హాజరై కేంద్ర ప్రభుత్వ తీరును వ్యతిరేకించాలని ఆయన కోరారు.
ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మునిమనుమడు చంద్ర కుమార్ బోస్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన టీఎంసీలో చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది.