Home » TMC
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా నాలుగోసారి అధికారంలోకి వచ్చేందుకు పట్టుదలగా ఉన్న మమతా బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్ శుక్రవారంనాడు పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది.
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి పోటీ చేసే 291 మంది అభ్యర్థుల జాబితాను తృణమూల్ కాంగ్రెస్ ప్రకటించింది. పార్టీ అధ్యక్షురాలు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనకు గట్టి పట్టున్న భవానీపూర్ నియోజకవర్గం నుంచే మరోసారి పోటీ చేయనున్నారు.
అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార తృణమూల్ కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణతో కోల్కతా నగరం యుద్ధక్షేత్రాన్ని తలపించింది. రాష్ట్ర మంత్రి శశి పంజా నివాసమే లక్ష్యంగా జరిగిన దాడి ఈ ఉద్రిక్తతలకు కేంద్రబిందువైంది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలుసుకునేందుకు అపాయింట్మెంట్ కోరిన తృణమూల్ కాంగ్రెస్ నేతలకు నిరాశ ఎదురైంది. పశ్చిమబెంగాల్లో గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించేందుకు 12 మంది సభ్యుల టీఎంసీ ప్రతినిధి బృందం రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరింది.
ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగిస్తున్నారంటూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శనివారం ధర్నాకు దిగారు. రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో అర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె నిరసన బాటపట్టారు.
కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) వ్యవస్థాపక సభ్యుడు ముకుల్ రాయ్ (Mukul Roy) కన్నుమూశారు. కోల్కతా ఆసుపత్రులో చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు.
టీఎంసీ సంబంధించిన ఎలాంటి డేటాను తాము సీజ్ చేయలేదని కోల్కతా హైకోర్టులో విచారణ సందర్భంగా ఈడీ తెలిపింది. కస్టడీలోకి తీసుకోని సామగ్రిని సురక్షితంగా ఉంచాలనడం ఏమిటని ప్రశ్నించింది.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కార్యాలయం ముందు శుక్రవారం ఉదయం టీఎంసీ ఎంపీలు నిరసన చేపట్టారు. అమిత్ షాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు రంగంలోకి దిగి వారిని అక్కడినుంచి పంపించారు..
బెల్డంగాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కబీర్ మాట్లాడుతూ, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని, తాను ముర్షీదాబాద్లోని రెజినగర్, బెల్డంగా నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తానని చెప్పారు.
పశ్చిమబెంగాల్లో ఇప్పటికే బీజేపీ, టీఎంసీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సి పర్యటన సందర్భంగా కోల్కతా స్టేడియనంలో అభిమానులు విధ్వంసం సృష్టించడంతో బీజేపీ టీఎంసీపై విమర్శలు గుప్పించింది.