Home » TMC
భారత ప్రభుత్వ నిర్వహణలోని దూరదర్శన్ చానెల్(Doordarshan) తన లోగో రంగును(Logo) కాషాయం రంగులోకి మార్చడం పెను దుమారాన్ని రేపుతోంది. రంగు మార్పుపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. డీడీ న్యూస్ మాజీ సీఈవో, టీఎంసీ ఎంపీ జవహర్ సిర్కార్ మాట్లాడుతూ.. డీడీ లోగో కాషాయం రంగులోకి మారడం బాధ కలిగించిందని అన్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ( Mamata Banerjee ) ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రామనవమి వేడుకల సందర్భంగా బెంగాల్ లోని ముర్షిదాబాద్ లో జరిగిన హింసపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్లో మొదటి విడత లోక్సభ ఎన్నికలు ( Lok Sabha Elections 2024 ) జరుగుతున్న తరుణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. పలు చోట్ల జరుగుతున్న హింసాత్మక ఘటనలతో బెంగాల్ రణరంగాన్ని తలపిస్తోంది.
ముర్షిదాబాద్ ఘటన ముందస్తు ప్రణాళికతో జరిగిందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ( Mamata Banerjee )మండిపడ్డారు. ఈ ఘటనకు బీజేపీ నేతలే కారణమని ఆరోపించారు. రాయ్గంజ్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె సంచలన కామెంట్లు చేశారు.
శ్రీరామనవమి సందర్బంగా పశ్చిమ బెంగాల్లో ( West Bengal ) నిర్వహించిన రామనవమి ఊరేగింపులో జరిగిన ఘర్షణలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే కారణం అని బీజేపీ మండిపడింది. రాష్ట్రంలోని ముర్షిదాబాద్లో బుధవారం రామనవమి ఊరేగింపు జరిగింది
లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ మరో రెండ్రోజుల్లో ఉందనగా ఎన్నికల మేనిఫెస్టోను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బుధవారంనాడు విడుదల చేసింది. తొలి దశలో కూచ్బెర్, అలిపుర్దౌర్, జలపాయ్గురిలో పోలింగ్ జరుగనుంది. టీఎంసీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో 10 ప్రధాన హామీలను ప్రకటించింది.
కేంద్రంలోని బీజేపీ(BJP) సర్కార్ దేశాన్ని నిర్బంధ శిబిరంగా మార్చిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(Mamata Banerjee) విమర్శలు గుప్పించారు. అస్సాంలో టీఎంసీ అభ్యర్థులకు మద్దతుగా బుధవారం నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో దీదీ పాల్గొన్నారు.
సందేశ్ఖాళిలో టీఎంసీ బహిష్కృత నేత షేక్ షాజహాన్ అండ్ కో చేసిన ఆగడాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ ఏం జరిగిందనే అంశంపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యులు పర్యటించి నివేదిక రూపొందించారు. ఆ రిపోర్టులో విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి.
పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఓ యాత్రికురాలిని నడి రోడ్డుపై ఓ యువకుడు వేధించాడు. ఈ ఘటన తాలూకూ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ టీఎంసీ ఈ ఘటనపై స్పందించింది.
కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి బహరాంపూర్లో నడిరోడ్డుపై తమ కార్యకర్తను నిలదీస్తూ వీరంగ సృష్టించడాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. అధీర్ రంజన్ దౌర్జన్యాన్ని ఎండగడుతూ ఘటనకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది.