Home » TMC
నేతాజీ సుభాష్ చంద్ర బోస్ బంధువు చంద్ర కుమార్ బోస్ తృణమూల్ కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. BJPని వీడిన తర్వాత, అసెంబ్లీ ఎన్నికలకు ముందు మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీలో చేరిన బోస్, ఇప్పుడు మరో రాజకీయ మార్పు దిశగా అడుగులు వేశారు.
పశ్చిమ బెంగాల్లో భారీగా అవినీతి సొమ్ము బయటపడింది. ఓ మాజీ బస్సు డ్రైవర్ ఇంట్లో బయటపడిన ఈ నగదును లెక్కించే క్రమంలో ఏకంగా 5 కౌంటింగ్ మెషీన్లు విఫలం కావడం విశేషం.
లోక్సభ సమావేశాల సందర్బంగా మహిళా ఎంపీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న కారణంతో టీఎంసీ పార్టీ ఎంపీ కల్యాణ్ బెనర్జీపై సస్పెన్షన్ వేటు పడింది. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు సభ నుంచి కల్యాణ్ బెనర్జీని సస్పెండ్ చేశారు.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరో పెను సంచలనం నమోదైంది. టీఎంసీలో కీలక నేత, మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే మదన్ మిత్ర పార్టీకి గుడ్బై చెప్పి, రీతాబ్రతా బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు టీఎంసీ వర్గంలో చేరారు.
బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు మరో షాక్ తగిలింది. ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ముగ్గురు ఎంపీలు తాజాగా బీజేపీలో చేరారు.
రాజకీయంగా తనను అడ్డుకోవడం ఎవరి వల్లా సాధ్యంకాదని, తనను ఆపాలంటే తన ప్రాణాలు తీయాల్సిందేనని పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ తేల్చి చెప్పారు.
తృణమూల్ కాంగ్రెస్లో ఆధిపత్య పోరు ముదురుతోంది. రితబ్రత బెనర్జీ నేతృత్వంలోని తిరుగుబాటు టీఎంసీ వర్గం కోల్కతాలోని పార్టీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకోవడం సహా తమదే అసలైన టీఎంసీ అని ఓ సమావేశం కూడా నిర్వహించింది.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా కార్యాలయంపై బీజేపీ ఆందోళనకారులు దాడి చేశారు. బుధవారం కృష్ణానగర్లోని ఆమె కార్యాలయంపై కోడిగుడ్లు, కూరగాయలు విసిరారు.
తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి కోల్కతా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ బ్యాంక్ ఖాతాల ఫ్రీజింగ్ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలన్న టీఎంసీ విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది.
బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీఎంసీలో అంతర్గత విభేదాలు ముదురుతున్న తరుణంలో మమతా బెనర్జీ తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.