Share News

PM Modi: కుటుంబ బంధనాల నుంచి దేశానికి విముక్తి కల్పించాం.. ప్రధాని మోదీ..

ABN , Publish Date - Apr 06 , 2024 | 10:45 AM

దేశంలోని 140 కోట్ల మంది భారతీయుల కలలను బీజేపీ సాకారం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) అన్నారు. యువత ఆకాంక్షలను నెరవేర్చగల ఏకైక పార్టీ బీజేపీ అని చెప్పారు. భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు.

PM Modi: కుటుంబ బంధనాల నుంచి దేశానికి విముక్తి కల్పించాం.. ప్రధాని మోదీ..

దేశంలోని 140 కోట్ల మంది భారతీయుల కలలను బీజేపీ సాకారం చేసిందని ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) అన్నారు. యువత ఆకాంక్షలను నెరవేర్చగల ఏకైక పార్టీ బీజేపీ అని చెప్పారు. భారతీయ జనతా పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ అంటే భారతదేశం ఇష్టపడే పార్టీ అని కొనియాడారు. అభివృద్ధి, సుపరిపాలన, జాతీయ విలువల పట్ల నిబద్ధతతో భాజపా ముద్ర వేసిందని వెల్లడించారు. ఇన్నేళ్లుగా పార్టీని నిర్మించిన మహనీయుల కృషి, పోరాటాలు, త్యాగాలను స్మరించుకోవాల్సిన తరుణం ఇది అని అన్నారు. నేషన్ ఫస్ట్ అనే నినాదంతో సేవలందిస్తున్న పార్టీ బీజేపీ అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.


Arvind Kejriwal: జైలు నుంచే ప్రభుత్వాన్ని నడపాలనుకుంటున్న కేజ్రీవాల్‌కు మరో షాక్?

"మా కార్యకర్తలు 140 కోట్ల మంది భారతీయుల కలలను సాకారం చేయడం చాలా ఆనందాన్నిచ్చే విషయం. కేంద్రంలో అయినా రాష్ట్రాల్లో అయినా మా పార్టీ సుపరిపాలనను అందిస్తోంది. మా పథకాలు, విధానాలు పేదలకు బలాన్నిచ్చాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుంది. అవినీతి, బంధుప్రీతి, కులతత్వం, మతతత్వం, ఓటు బ్యాంకు రాజకీయాల నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు బీజేపీ కట్టుబడి ఉంది."

- ప్రధాని నరేంద్ర మోదీ


Sonam Wangchuk: ర్యాలీకి పిలుపునిచ్చిన సోనమ్ వాంగ్‌చుక్.. జిల్లాలో ఇంటర్ నెట్ బంద్, 144 సెక్షన్

కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం పార్టీ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీని ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా మార్చే ప్రయాణంలో తమ జీవితాలను అంకితం చేసిన అసంఖ్యాక కార్యకర్తలకు వందనం చేస్తున్నానన్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Apr 06 , 2024 | 10:45 AM