Share News

Errolla Srinivas: సమైక్యవాదుల కంటే సీఎం రేవంత్‌రెడ్డి అత్యంత ప్రమాదకరం

ABN , Publish Date - Apr 26 , 2024 | 07:42 PM

మైక్యవాదుల కంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అత్యంత ప్రమాదకరమని బీఆర్ఎస్ సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ (Errolla Srinivas) ఆరోపించారు. సమైక్యవాదుల ముసుగులో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ అమరవీరులను అవమానించేలా రేవంత్ మాట్లాడారని మండిపడ్డారు.

Errolla Srinivas: సమైక్యవాదుల కంటే సీఎం రేవంత్‌రెడ్డి అత్యంత ప్రమాదకరం

హైదరాబాద్: సమైక్యవాదుల కంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అత్యంత ప్రమాదకరమని బీఆర్ఎస్ (BRS) సీనియర్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ (Errolla Srinivas) ఆరోపించారు. సమైక్యవాదుల ముసుగులో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ అమరవీరులను అవమానించేలా రేవంత్ మాట్లాడారని మండిపడ్డారు. శుక్రవారం నాడు తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీఎం మాటలతో అమరుల ఆత్మ ఘోషిస్తుందన్నారు. సీఎం బేషరతుగా అమరుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.


CM Revanth: రుణమాఫీ చేసి తీరుతాం... హరీష్ రాజీనామా రెడీగా పెట్టుకో.. రేవంత్ కౌంటర్

అసలు స్తూపం పవిత్రత మీకు తెలుసా అని ప్రశ్నించారు. స్తూపాన్ని తెలంగాణ సమాజం దైవంలా భావిస్తుందని తెలిపారు. రేవంత్‌లో అణువణువునా తెలంగాణ వ్యతిరేకత ఉందని విమర్శించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుణ్యానా మీకు పదవులు వచ్చాయన్నారు. రాజీనామా లేఖతో రమ్మంటే రేవంత్ రెడ్డి తప్పించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు అక్కడకు వెళ్లడంతో అమరుల స్తూపం మలినమైందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి చిల్లరగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఒట్టేస్తున్న సీఎం రేవంత్‌కు దేవుళ్లను మోసం చేయడం ఓ లెక్కకాదని ఎర్రోళ్ల శ్రీనివాస్ దుయ్యబట్టారు.


ఇవి కూడా చదవండి

Balmoor Venkat: అలాంటి వ్యక్తి వచ్చాడనే గన్‌పార్క్ వద్ద పసుపు నీళ్లతో శుద్ధి చేశా..

Congress: హరీష్‌రావు రాజీనామా స్పీకర్ ఫార్మాట్‌లో లేదు: మంత్రి కోమటిరెడ్డి

Kothakota Srinivas: ప్రభాకర్‌కు రెడ్‌ కార్నర్ నోటీసులపై హైదరాబాద్ సీపీ షాకింగ్ కామెంట్స్

Read Latest Election News or Telugu News

Updated Date - Apr 26 , 2024 | 07:51 PM