Share News

TDP: సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్న లోకేష్

ABN , Publish Date - Mar 08 , 2024 | 10:31 AM

Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ శుక్రవారం ఉదయం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్య సాయి బాబా మహాసమాధిని దర్శించుకున్నారు. ప్రశాంతి నిలయంలో లోకేష్‌కు సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్రీ ఆర్జే రత్నాకర్ స్వాగతం పలికారు. దర్శనానంతరం కొత్తచెరువులో జరిగే శంఖారావం కార్యక్రమంలో యువనేత పాల్గొననున్నారు.

TDP: సత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకున్న లోకేష్

శ్రీ సత్య సాయి జిల్లా, మార్చి 8: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్(TDP Leader Nara lokesh) శుక్రవారం ఉదయం పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్య సాయి బాబా మహాసమాధిని (Satyasai baba Maha Samadhi) దర్శించుకున్నారు. ప్రశాంతి నిలయంలో లోకేష్‌కు సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్రీ ఆర్జే రత్నాకర్ స్వాగతం పలికారు. దర్శనానంతరం కొత్తచెరువులో జరిగే శంఖారావం కార్యక్రమంలో యువనేత పాల్గొననున్నారు.

కాగా... మరికాసేపట్లో పుట్టపర్తి శంఖారావం సభ (Shankaravam Sabha) ప్రారంభంకానుంది. పుట్టపర్తి టీడీపీ ఇన్‍ఛార్జ్ పల్లె రఘునాథరెడ్డి నేతృత్వంలో కొత్తచెరువు ప్రాంగణానికి జనసేన, టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. రాబోయే ఎన్నికలను ఎదుర్కోవడం, బాబు సూపర్ సిక్స్ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై క్యాడర్‌కు లోకేష్ దిశానిర్దేశం చేయనున్నారు. బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో మెరుగైన పనితీరు కనబర్చిన కార్యకర్తలకు ప్రశంసపత్రాలు అందజేయనున్నారు. పుట్టపర్తి సభ అనంతరం మధ్యాహ్నం కదిరి శంఖారావం సభలో యువనేత నారా లోకేష్ పాల్గొననున్నారు.

ఇవి కూడా చదవండి...

Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి ఎన్ని కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారంటే..

Maha Shivratri: హర హర మహాదేవ్... తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభ


మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 08 , 2024 | 10:31 AM