Share News

Sharmila: ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఛార్జ్ షీట్: షర్మిల

ABN , Publish Date - May 08 , 2024 | 11:13 AM

అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలుగుదేశం అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో పొత్తుపెట్టుని.. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో ఏ పొత్తు లేదన్నట్టుగా సభల్లో ఆయనను దూషిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.

Sharmila:  ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఛార్జ్ షీట్: షర్మిల

అమరావతి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) తెలుగుదేశం అధ్యక్షుడు (TDP Chief) నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)తో పొత్తుపెట్టుని.. వైసీపీ అధ్యక్షుడు (YCP President) జగన్మోహన్ రెడ్డి (Jaganmohan Reddy)తో ఏ పొత్తు లేదన్నట్టుగా సభల్లో ఆయనను దూషిస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షురాలు (APCC Chief) షర్మిల (Sharmila) విమర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ తిప్పలన్నీ కేవలం మైనారిటీ ఓటు బ్యాంక్ (Minority Vote Bank) కోసం ఆయన చేస్తున్నారని ఆరోపించారు. అంటే హిందూ (Hindu), టీడీపీ (TDP), బీజేపీ (BJP) ఓటు బ్యాంక్ ఇన్ఫాక్టుగా చంద్రబాబు పొత్తుతో ఉండాలని.. మిగతా మైనారిటీ ఓటు బ్యాంక్ అంతా జగన్ కార్నర్ చేసుకోగలిగితే.. ఈ రెండు ఓటు బ్యాంక్‌లు మళ్లీ మోదీకే లబ్ది చేకూరాలన్నది ప్రధాని స్ట్రాటజీ అని షర్మిల వ్యాఖ్యానించారు.


‘ ప్రధాని మోదీగారు.. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పిచ్చోలు కాదు.. ప్రజల గుండెచప్పుడు ఒకసారి వినండి’.. అంటూ షర్మిల టేప్ రికార్డర్ ఆన్ చేశారు. మన్‌కీ బాత్‌లో మోదీ ప్రసంగిస్తుంటారని, ఈ విధంగా ఆయనకు చెబితే అర్థమవుతుందని తమకు అనిపించిందని ఆమె అన్నారు. ఏపీ మన్‌కీ బాత్ ఒకసారి ప్రధాని చెవిలో పడితే బాగుంటుందని ఆమె అన్నారు. ‘‘గత పదేళ్లుగా ఏపీ ప్రజలకు అన్యాయం చేశారని, కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన ప్రధాని మోదీపై పదేళ్లకుగానూ పది చార్జస్‌తో ఒక చార్జ్ షీటు మీకు పంపిస్తున్నాం.. అది మీరు చదవండి.. మీ మీద పది అభియోగాలు ఏమున్నాయో ఒక సారి అర్ధం చేసుకోండి.. ఆ చార్జ్ షీటు ప్రకారం ఏపీ ప్రజలకు లిఖితపూర్వంగా క్షమాపణ లేఖ రాసి.. రాష్ట్ర ప్రజల హక్కులన్నీ కాపాడతామని ఆఫిడవిట్ రాసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో అడుగుపెట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోందని’’ షర్మిల అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

వేములవాడలో కోడెమొక్కులు తీర్చుకున్న ప్రధాని మోదీ

జగన్‌కు వసంత కృష్ణ ప్రసాద్ సవాల్..

జనసేన దూకుడు.. వైసీపీ విలవిల..

CM Revanth: దేశ భద్రతకే ముప్పు తెచ్చారు

ఏపీలో కలెక్టర్లు, ఎస్పీలకు ఎన్నికల కమిషన్ వార్నింగ్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 08 , 2024 | 11:18 AM