Share News

Sujana Chaudary: బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశా

ABN , Publish Date - Apr 18 , 2024 | 03:24 PM

Andhrapradesh: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి నామినేషన్ దాఖలు చేశారు. భారీ ర్యాలీగా పశ్చిమ తహశీల్దారు కార్యాలయానికి చేరుకుని సుజనా.. రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేడు బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశాను’’ అని తెలిపారు.

Sujana Chaudary: బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశా
BJP candidate Sujana Chaudhary files nomination

విజయవాడ, ఏప్రిల్ 18: విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరి (BJP Candidate Sujana Chaudary) నామినేషన్ (Nomination) దాఖలు చేశారు. భారీ ర్యాలీగా పశ్చిమ తహశీల్దారు కార్యాలయానికి చేరుకుని సుజనా.. రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు. నామినేషన్ అనంతరం సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేడు బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశాను’’ అని తెలిపారు. నియోజకవర్గ ప్రజలు బ్రహ్మ రధం పడుతున్నారని.. కూటమి పార్టీల నాయకులు తపకు మద్దతుగా తరలివచ్చారన్నారు. నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయని.. గత పాలకులు వీటిపై దృష్టి పెట్టలేదని విమర్శించారు.

Viral Video: నడి రోడ్డుపై మ్యాన్‌హోల్ వద్ద వాహనదారులకు షాకిచ్చిన మహిళ.. మరో ఇద్దరితో కలిసి..


ప్రజల పాట్లను ఏమాత్రం పట్టించుకో లేదన్నారు. తాను గెలిచి ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేశామన్నారు. తనకున్న అనుభవంతో ప్రజలకు సేవ చేస్తానని వెల్లడించారు. టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు కలిసి కట్టుగా పని చేస్తున్నారని చెప్పారు. మే 13 తరువాత వైసీపీపై ప్రజాగ్రహం ఎలా ఉందో చూస్తారన్నారు. రాష్ట్రంలో కూడా కూటమి అధికారంలోకి రావడం ఖాయమన్నారు.‘‘ఝాన్సీలక్ష్మి నా మీద అభిమానంతో నాతో కలిసి నామినేషన్ వేశారు’’ అని సుజనా చౌదరి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Bosta: పదివేల కోట్లతో విశాఖ మరింత అభివృద్ధి.. అదే అమరావతికి పెడితే ఏం వస్తుంది?

Summer Season: తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. ఆ తేదీ వరకు అప్రమత్తత తప్పనిసరి

మరిన్ని ఏపీ వార్తల కోసం..

Updated Date - Apr 18 , 2024 | 03:27 PM