Share News

Dharmana Prasada Rao: ఎవరికి ఓటేస్తారని ఎవరిని అడిగినా చంద్రబాబుకే అంటున్నారు

ABN , Publish Date - Apr 02 , 2024 | 09:51 AM

మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ మన పార్టీ గుర్తు తెలియటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం రూరల్ మండలం బెండివానిపేట ప్రచారంలో ధర్మాన ఈ వ్యాఖ్యలు చేశరాు. ఎవరికి ఓటేస్తారని ఎవరిని అడిగినా కూడా టీడీపీ అధినేత చంద్రబాబుకే అంటున్నారన్నారు.

Dharmana Prasada Rao: ఎవరికి ఓటేస్తారని ఎవరిని అడిగినా చంద్రబాబుకే అంటున్నారు

శ్రీకాకుళం: మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasad Rao) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ మన పార్టీ గుర్తు తెలియటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం రూరల్ మండలం బెండివానిపేట ప్రచారంలో ధర్మాన ఈ వ్యాఖ్యలు చేశరాు. ఎవరికి ఓటేస్తారని ఎవరిని అడిగినా కూడా టీడీపీ అధినేత చంద్రబాబుకే అంటున్నారన్నారు. ఏ గుర్తుకు ఓటేస్తారు అంటే సైకిల్, హస్తం గుర్తు పేర్లే చెబుతున్నారన్నారు. మన పార్టీ గుర్తు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లండని పార్టీ కార్యకర్తలకు ధర్మాన తెలిపారు.

YS Sharmila: కడప జిల్లాలో పర్యటించనున్న షర్మిల

మంత్రి ధర్మాన ప్రసాద రావు ఎన్నికల ప్రచారంలో అపశ్రుతి చోటుచేసుకుంది. సోమ వారం శ్రీకాకుళం మండలం తండేంవలస సమీపాన బెండివానిపేటలో ధర్మాన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆంజ నేయస్వామి ఆలయం వద్ద కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు బాణసంచా కాల్చారు. గడ్డికుప్పలు ఉన్నాయని.. ఇక్కడ బాణసంచా కాల్చొద్దని గ్రామస్థులు వారించినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో కుంచాల అప్పా రావు, రమణకు చెందిన గడ్డికుప్పలపై తారాజువ్వలు పడి.. మంటలు వ్యాపించి దగ్ధమయ్యాయి. వీరితోపాటు మరో రైతుకు చెందిన గడ్డికుప్ప కూడా అంటుకుంది. మంటలను ఆర్పేందుకు గ్రామస్థులు ప్రయత్నించినా ఫలితం లేకపో యింది. శ్రీకాకుళం, ఆమదాలవలస అగ్నిమాపకశాఖ అధికా రులకు సమాచారం అందజేయడంతో వారు వచ్చి మంటలను అదుపు చేశారు. ఇంత జరిగినా మంత్రి ప్రచారం ఆపలేదని, కనీసం బాధితులను పరామర్శించలేదనే విమర్శలు వెల్లువెత్తాయి.

CM Jagan: నేడు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్న సీఎం జగన్..

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Apr 02 , 2024 | 10:54 AM